
Atrocious: గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో చోటుచేసుకున్న బాలుడిపై లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. నగర పరిధిలోని ఓ మసీదు ప్రాంగణంలో 8 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో పోలీసులు 23 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని నోమన్ షబ్బీర్ షేక్గా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు నమాజ్ ఎలా చేయాలో నేర్పిస్తానని చెప్పి ఆ బాలుడిని మసీదు రూఫ్పైకి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడే అతడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
సీసీటీవీ ఫుటేజీ ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. నిందితుడు బాలుడితో కలిసి మసీదు టెర్రస్పై దాదాపు 20 నిమిషాల పాటు గడిపినట్లు ఫుటేజీ ద్వారా తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆధారాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాలుడికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేశారు. అలాగే బాలుడి కుటుంబానికి భరోసా కల్పిస్తూ, నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ALSO READ: Shocking: భార్య ప్రైవేట్ పార్టులో కర్ర గుచ్చి.. ఆపై?





