
అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కుట్ర ఉందా..? తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బన్నీని అరెస్ట్ చేయించిదా..? ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకొచ్చింది అంటే.. బెంగళూరు తొక్కిసలాట ఘటన తర్వాత.. అల్లు అర్జున్ అరెస్ట్పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నారు చాలా మంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ను బాధ్యుడ్ని చేసిన కాంగ్రెస్ సర్కార్.. బెంగళూరు తొక్కిసలాటకు ఎవరిని బాధ్యులను చేయబోతోంది అని ప్రశ్నిస్తున్నారు. కోహ్లీని అరెస్ట్ చేస్తారా..? చేయగలరా..? అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పేలుతున్నాయి. అరెస్ట్ కోహ్లీ అన్న హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి కూడా వచ్చింది. అంతేకాదు.. జనసేన పార్టీ నేత కూడా ఇదే అర్థం వచ్చేలా… బన్నీ అరెస్ట్పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నట్టు చేసిన కామెంట్స్ ఇప్పుడు.. చర్చనీయాంశమయ్యాయి.
ఐపీఎల్-2025 ట్రోఫీని RCB గెలిచింది. ఈ సందర్భంగా.. స్వరాష్ట్రం బెంగళూరులో విజయోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే.. ఆ విజయోత్సవం కాస్తా.. విషాదాంతమైంది. 11 మంది ప్రాణాలను బలిగొంది. చాలా మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన… కాంగ్రెస్ను కుదుపేస్తోంది. కర్నాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే.. ఈ ఘోరం జరిగిందని బీజేపీ.. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఏకిపారేస్తోంది. అంతేకాదు… అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ తీరును తప్పుబడుతోంది కమలం పార్టీ.
జనసేన పార్టీ నేత, పవన్ కళ్యాణ్ రైట్ హ్యాండ్గా చెప్పబడే నాయకుడు.. బొలిశెట్టి సత్యనారాయణ. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు… హాట్ టాపిక్గా మారాయింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ను కావాలనే అరెస్ట్ చేశారు అనేలా… ఆయన కామెంట్స్ చేశారు. బెంగళూరు తొక్కిసలాటపై సీఎం రేవంత్రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు బొలిశెట్టి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ను అరెస్ట్ను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని.. ఇప్పుడు బెంగళూరులో అలాంటి ఘటనే జరిగిందని… అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కనుక ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలని పోస్టు పెట్టారాయన. ప్రమాదం జరిగినప్పుడు… ఎదుటివారిపై నిందలు వేయకుండా… ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవాన్నారు. జరిగిన తప్పు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాని కోరారు. కక్ష సాధింపు ఎప్పటికీ మంచిది కాదన్నారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. అంటే… అల్లు అర్జున్ విషయంలో… కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందని ఆయన చెప్పకనే చెప్పారన్న మాట.