ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

వయస్సు 76… అయినా ఇదేమ్ స్టామినా సార్?

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వయస్సు ప్రస్తుతం 76 సంవత్సరాలు. ఈ వయస్సులో ప్రతి సామాన్యుడు కూడా ఏదో ఒక వీల్ చైర్కీ లేదా అనారోగ్యపు పాలై ఆస్పత్రులు లేదా మందులు అంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాత్రం వీళ్ళందరికీ పూర్తి ప్రతిపక్షంగా మారిపోయారు. సామాన్యంగా 76 ఏళ్ల వయసులోని వారు పది నిమిషాలు కూర్చోవాలన్నా లేదా పది నిమిషాలు నించోవాలని అన్న తెగ ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఏకంగా గంట 45 నిమిషాల పాటు నిల్చోని ప్రసంగించడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఏకంగా రెండు గంటల పాటు రాష్ట్రం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ తరం యువకులను షాకుకు గురి చేశారు.
పాలు పగిలిపోయాయని కంప్లైంట్.. కూకట్ పల్లిలో హెరిటేజ్ పై కేసు!
తాజాగా కూటమి ప్రభుత్వం ఆంధ్రాలో ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సోమవారం నాడు అమరావతిలో చంద్రబాబు నాయుడు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో పాటుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి మరియు జిల్లాస్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా మొదటగా నారా లోకేష్ మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలక అంశాల గురించి ప్రస్తావించారు. ఆ తరువాత మైక్ తీసుకున్న చంద్రబాబు నాయుడు ఏకంగా 1.45 గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొనసాగించారు. అలాగే ఈ ప్రజెంటేషన్లు చంద్రబాబు నాయుడు అనేక అంశాల గురించి ప్రస్తావిస్తున్న సమయంలో అక్కడే కూర్చుని ఉన్నా చాలా మంది ఎమ్మెల్యేలు మరియు మంత్రులు అలాగే అధికారులు కూర్చోలేక కొంచెం ఇబ్బందులు పడ్డ కూడా చంద్రబాబు నాయుడు మాత్రం ఏ మాత్రం ఇబ్బంది పడకుండా రెండు గంటలపాటు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ తరహా ప్రసంగాలను అది కూడా ఈ వయసులో చేయడమనేది అంత సులభం కాదని చాలామంది చంద్రబాబు నాయుడుని ప్రశంసిస్తున్నారు.

ఆ పనిలో ఉండగా చూసిందని.. ప్రియుడితో కలిసి తల్లిని చంపేసిన 10వ తరగతి బాలిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button