Monday, February 16, 2026
Homeఆంధ్ర ప్రదేశ్Family Politics: రాజకీయ కుటుంబాల్లో.. కుటుంబ రాజకీయాల చిచ్చు!

Family Politics: రాజకీయ కుటుంబాల్లో.. కుటుంబ రాజకీయాల చిచ్చు!

Lalu Yadav Family Politics: రాజకీయ కుటుంబాల్లో.. కుటుంబ రాజకీయాలు కొత్తేమీ కాదు. అవి బటపడి బయటకు వెళ్లిన సందర్భాలకూ కొదవేమీ లేదు. ఏపీలో ఇప్పటికే తన పుట్టిల్లును, అన్నను విభేదించి బయటకు వచ్చిన షర్మిల గానీ, తెలంగాణలో అన్న, బావను టార్గెట్ చేస్తున్న కవిత గానీ ఇదే కోవలోకి వస్తారు. తాజాగా ఈ లిస్టులో మరో ఆడపడుచు చేరింది. షర్మిల, కవిత మాదిరిగానే బీహార్‌లో ఆర్జేడీ చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె రోహిణి ఆచార్య కుటుంబం నుంచి బయట అడుగు పెట్టింది. తేజస్వియాదవ్‌, ఆయన అనుచరులు కలిసి తనను దారుణంగా అవమానించారంటూ తీవ్ర ఆరోపణలు  చేసింది.  ఇకపై ఆ కుటుంబంతో, ఆర్జేడీతో తన సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో, రోహిణి  ముగ్గురు చెల్లెళ్లు కూడా పట్నాలోని లాలూ నివాసాన్ని వదిలేసి ఢిల్లీకి వెళ్లిపోయారు.

బీహార్ పరాభవం తర్వాత రోజే కీలక ప్రకటన

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైన మరుసటి రోజే లాలూ కుటుంబంలో చిచ్చు మొదలయ్యింది. ఆర్జేడీని, లాలూ కుటుంబాన్ని వీడుతున్నట్టు రోహిణి ఆచార్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన సోదరుడు తేజస్వియాదవ్‌, ఆయన సన్నిహితులు తనను తీవ్రంగా అవమానించారని, కొట్టడానికి సిద్ధమయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణ ఓటమికి తేజస్వియాదవ్‌ సన్నిహితులు హరియాణాకు చెందిన ఎంపీ సంజయ్‌ యాదవ్‌, యూపీకి చెందిన రమీజ్‌ కారణమని ఆరోపించింది. 47 ఏళ్ల రోహిణి ఆచార్య లాలూ రెండో కుమార్తె. వైద్యురాలు అయిన ఆమె భర్తతో కలసి మొదట్లో సింగపూర్‌ లో సెటిల్ అయ్యారు. లాలూ రెండు కిడ్నీలు దెబ్బతినడంతో.. ఆమె తన కిడ్నీని తండ్రికి ఇచ్చారు. కొంతకాలం నుంచి పట్నాలోనే ఉంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సరణ్‌ స్థానంలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తాజాగా కుటుంబానికి దూరమయ్యారు.

లాలూకు ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు

లాలూకు మొత్తం తొమ్మిది మంది సంతానం. ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో రెండో కుమార్తె రోహిణి. ఆమె బయటకు వచ్చిన నేపథ్యంలో, లాలూ మరో ముగ్గురు కుమార్తెలు రాజ్యలక్ష్మి, రాగిణి, చందా కూడా పట్నా నివాసం నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఇప్పటికే రాజకీయ కారణాలతో లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన జనశక్తి జనతాదళ్‌ (జేజేడీ) పేరిట పార్టీ స్థాపించారు. ఇటీవలి ఎన్నికల్లో మహువా నుంచి పోటీ చేసి, ఓడిపోయారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments