- పోష్ చట్టం పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
మంచిర్యాల, క్రైమ్ మిర్రర్: సింగరేణి సంస్థల్లో ఆయా గనుల, డిపార్ట్మెంట్ల కార్యాలయల్లో పని చేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులపై ఎవరైన లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జీఎం రాధాక్రిష్ణ అన్నారు. లైంగింగ్ వేధింపులకు పాల్పడిన వారిపై ఎవరైన ఫిర్యాదు చేస్తే సెక్సువల్ అరాస్మెంట్ వుమెన్ ఎట్ వర్కుప్లేస్ చట్టం 2013 ప్రకారంగా చర్యలు ఉంటాయని తెఎలిపారు.
స్థానిక జీఎం కార్యాలయంలో మహిళా ఉద్యోగులకు పోష్ యాక్టు అవగాహనకు సంబంధించి అంతర్గత ఫర్యాదుల కమిటీచే పరీక్షలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయి మాట్లాడారు. ఈ చట్టం ప్రకారం ఎలాంటి అంతర్గత ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపారు.ఈ పరీక్షలో ముగ్గురిని ఎంపిక చేసిన మహిళా దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఎం అశోక్, మదర్ థెరిస్సా ఎంజీవో అద్యక్షురాలు భువనేశ్వరి, అంతర్గత ఫిర్యాదుల కమిటీ సభ్యులు డీవైపీఎం ఎఫ్ండ్ే సరిత, ఎస్టేట్ ఆఫీసర్, సీనియర్ పీవో అనిత లు పాల్గొన్నారు.
