తెలంగాణ

బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు… ఎమ్మెల్యే మాగంటి మృతి!..

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ కీలక నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇవాళ ఉదయం 5 గంటలకు కన్నుమూశారు. మూడు రోజుల క్రితం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అతనిని దగ్గరలోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో నేడు తుది శ్వాస విడిచారు. దాదాపు మూడు రోజులపాటు టిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మరణించారు. మాగంటి గోపీనాథ్ ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు పోటీ చేసి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు.

మొదటగా టిడిపిలో రాజకీయ అరంగేట్రం చేసి 2018లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక అక్కడి నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. అయితే మాగంటి గోపీనాథ్ రాజకీయాల్లోకి రాకముందు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా ఉండేవారు. 1983 లోనే టిడిపి తో మాగంటి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1985 నుంచి 1992 వరకు అంటే దాదాపు ఏడు సంవత్సరాలు పాటు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2014లో టిడిపి తరఫున జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల దృశ్య టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. 2018 మరియు 2023లో టిఆర్ఎస్ పార్టీ నుంచే గెలుపొంది రాజకీయాల్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. ఇతరుణంలోనే ఇవాళ ఆరోగ్య పరిస్థితుల దృశ్య మరణించడం జరిగింది.

డిప్యూ సీఎం గొప్ప మనసు.. తన చార్టెడ్ ప్లేన్ లో పేషెంట్ ఆసుప్రతికి తరలింపు!

“ఇల్లే మా కల.. కానీ దొరికిందేమో నిరాశే!” బాధితురాలు గుర్రం ముత్యాలు ఆవేదన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button