![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/dc-Cover-92v9ggghpuf1ckjvi9058h1rr1-20171214013855.Medi_-780x448.jpeg?lossy=1&strip=1&webp=1)
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులందరికి ఒకటో తారీఖు రోజునే వేతనాలు అందిస్తామని గొప్పగా చెబుతోంది. కాని ఫిబ్రవరిలో 12 రోజులు దాటినా హోంగార్డులకు ఇంకా వేతనాలు రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 16వేలకు పైగా ఉన్న హోంగార్డులకు జీతాలు రాకపోవడంతో వాళ్లంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హోంగార్డులకు జీతాలు చెల్లించక పోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 16వేలకు పైగా ఉన్న హోం గార్డులకు 12 రోజులు గడస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని అన్నారు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చెయ్యాల్సిన దుస్థితి నెలకుందని హరీష్ రావు అన్నారు.
ఇఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న పరిస్థితి ఉందన్నారు హరీష్ రావు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేరని విమర్శించారు. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి దీనికి ఏం సమాధానం చెబుతారని హరీష్ రావు ప్రశ్నించారు. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు పెడుతున్నారని తెలిపారు.
ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా వ్యతిరేక పాలన అన్నారు. హోంగార్డులకు వేతనాలు తక్షణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.