క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ముందుగా కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళిసై.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించారన్నారు. ప్రగతిభవన్.. ప్రజాభవన్గా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని వెల్లడించారు. అర్హులకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని చెప్పారు. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం. దశాబ్ధకాంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తాం అని తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Read Also : హైదరాబాద్ లో ఎన్ఐఏ దాడులు.. ఆ పత్రిక ఎడిటర్ ఇంట్లో సోదాలు!!
ప్రజావాణి ద్వారా ప్రభుత్వం ప్రజా సమస్యలను తెలుసుకుంటోంది. తద్వారా కోటి 80 లక్షల దరఖాస్తులు వచ్చాయన్న విషయాన్ని మరోసారి సభలో ప్రస్తావించారు. ఇంటర్నెట్ కనీస అవసరంగా గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నాం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం. మూసీని అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తాం అని కాంగ్రెస్ పేర్కొన్న అంశాలను శాశససభలో చదివి వినిపించారు. దేశానికి హైదరాబాద్ను ఏఐ రాజధానిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. కొత్తగా రూ.40వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినట్లు పేర్కొన్నారు. చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ఎకో ఫ్రెండ్లీ టూరిజం హబ్గా హుస్సేన్సాగర్, లక్నవరంలను తీర్చిదిద్దుతామని చెప్పారు.
Also Read : మల్కాజ్గిరి ఎంపీ టికెట్ రేసులో హేమాహేమీలు.. అధిష్ఠానం చూపు అతనివైపేనా..?
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు హాజరు కాలేదు. కొద్ది రోజుల క్రితం స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఇవాళ్టి నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారని తొలుత భావించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాక గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ కేసీఆర్ గురువారం జరిగే గవర్నర్ ప్రసంగానికి రారని, బడ్జెట్ రోజు వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తారన్నది తెలియాల్సి ఉంది. దీని కోసం సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ఇవి కూడా చదవండి :
- గృహజ్యోతి ఫ్రీ కరెంట్ అర్హుల ఎంపికపై కసరత్తు.. రేషన్ కార్డు ఉంటనే పథకం ?
- అద్దెకు ఉండేవారికీ ‘గృహజ్యోతి’ వర్తింపు.. ఫ్రీ కరెంట్పై TSSPDCL క్లారిటీ
- కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం పెద్దఎత్తున పోటీ.. 17 ఎంపీ సీట్లకు 306 దరఖాస్తులు
- మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ.. ఆటో డ్రైవర్ల కీలక నిర్ణయం
- మరో పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్.. అక్కడి నుంచే ప్రారంభం!!
One Comment