క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో రాజకీయాలు ఉపందుకున్నాయి. ఓవైపు అధికార పార్టీ గెలుపు జోష్ను కంటిన్యూ చేస్తూ.. మెజార్టీ సీట్లు సాధించేందుకు ప్రణాళికలు రచిస్తుండగా.. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇక.. కేంద్రంలో ఫుల్ జోష్లో ఉన్న బీజేపీ పార్టీ.. తెలంగాణలోనూ కమలం హవా చూపించి.. అత్యధిక ఎంపీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే.. అసెంబ్లీ ఎన్నికల్లో తన పాదయాత్రతో ఓటింగ్ శాతం పెంచిన బండి సంజయ్ మరో పాదయాత్రతో రంగంలోకి దిగుతున్నారు. అయితే.. ఈసారి రాష్ట్రం మొత్తం కాకుండా.. తన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే యాత్ర కొనసాగనున్నట్టు తెలుస్తోంది.
Read Also : అప్పుడే మెుదలైన బానుడి బ్యాటింగ్… రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ పాదయాత్ర చేపట్టగా.. ఇప్పుడు విజయ సంకల్ప యాత్ర పేరుతో యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రను.. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు బండి సంజయ్. కాగా.. లోక్సభ ఎన్నికలు జరిగే వరకు ఈ యాత్ర కొనసాగించాలని బండి సంజయ్ నిర్ణయించుకున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం.. మేడిపల్లి నుంచి విజయ సంకల్ప యాత్రను బండి సంజయ్ ప్రారంభించనున్నారు. కాగా.. తొలిదశలో మొత్తం 119 కిలో మీటర్లు ఈ యాత్ర కొనసాగించనున్న బండి సంజయ్.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో యాత్రను ముగించనున్నారు.
Also Read : తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసన సభాపక్ష నేత పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్.. రేసులో ఆ నలుగురు..!
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలతతో పాటు వీలైనన్ని ఎక్కువ గ్రామాల గుండా పాదయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నారు. అయితే.. ఈ యాత్ర ద్వారా.. కేంద్ర అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రతో తెలంగాణలో బీజేపీ ముఖచిత్రమే మారిపోయిందని.. ఇప్పుడు చేపట్టనున్న విజయ సంకల్ప యాత్రతో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించబోతుందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 17 ఎంపీ సీట్లను గెలుచుకోవటమే లక్ష్యంగా పనిచేస్తుందని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రూప్ 1లో పోస్టుల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు
- కృష్ణా నదీ జలాల వాటపై కేసీఆర్ మరో పోరాటం.. 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ
- మియాపూర్ సీఐ ప్రేమ్కుమార్ సస్పెండ్…
- అద్దెకు ఉండేవారికీ ‘గృహజ్యోతి’ వర్తింపు.. ఫ్రీ కరెంట్పై TSSPDCL క్లారిటీ
- కుమారీ అంటీ స్టోరీపై ‘నెట్ఫ్లిక్స్’లో డాక్యుమెంటరీ.. అమ్మ బాబోయ్..!?
One Comment