తెలంగాణ

రాస్తారోకో – ధాన్యం కొనుగోలుపై రైతుల ఆందోళన

తడిసిన ధాన్యాన్ని కొనాలి… లేకపోతే పోరాటం ఉధృతం చేస్తాం – బోధన రైతులు హెచ్చరిక

సూర్యాపేట, క్రైమ్ మిర్రర్ : జిల్లాలోని బొల్లంపల్లి వద్ద 365 జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. తడిసిపోయిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పురుగుల మందు డబ్బాలతో రోడ్డుపై నిరసన తెలిపారు.

భారీ వర్షాల కారణంగా పంట ధాన్యం తడిసి మొలకెత్తినా, కొనుగోలు కేంద్రాలు కొనకుండా తిప్పిస్తుండటాన్ని రైతులు తప్పుపట్టారు. “పెట్టుబడులు మట్టిలో కలిసిపోయాయి… ప్రభుత్వమే బాధ్యత వహించాలి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఆందోళన కారణంగా నేషనల్ హైవేపై రవాణా పూర్తిగా స్తంభించింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే, ఉద్యమాన్ని జిల్లావ్యాప్తంగా విస్తరిస్తామని హెచ్చరించారు. అధికారులు రంగప్రవేశం చేసి రైతులతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల డిమాండ్లు పరిష్కార దిశగా సానుకూల స్పందన చూపించాలని స్థానిక నాయకులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button