
ఆస్ట్రేలియా పోలీసుల దాడిలో భారత సంతతి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో అక్కడి పోలీసుల తీరుకు మద్దతు తెలిపారు ఆస్ట్రేలియా ఉన్నతాధికారులు. ఆస్ట్రేలియా – అడిలైడ్లో ఉండే భారత సంతతి గౌరవ్ కుండి, అమృత్పాల్ దంపతుల మధ్య గత నెల 30న రోడ్డుపై చిన్న గొడవ జరిగింది. ఈ గొడవ చూసిన పెట్రోలింగ్ పోలీసులు గృహ హింసగా భావించి, ఇంటికి వెళ్ళి గౌరవ్ కుండిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు
అయితే తమ మధ్య ఏం గొడవ జరగలేదని, చిన్న వాగ్వాదం మాత్రమే జరిగిందని భార్య అమృత్పాల్ వారించిన పోలీసులు పట్టించుకోలేదు, తాను ఎలాంటి నేరం చేయలేదని గౌరవ్ వేడుకున్నా కనికరించలేదు.అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఓ పోలీసు అధికారి మెడపై కాలుతో గట్టిగా తొక్కడం, పోలీసు వాహనానికి బలంగా తాకడంతో గౌరవ్ అక్కడికక్కడే స్రృహ కోల్పోయాడు.. ఈ దృశ్యాలను అమృత్పాల్ ఫోన్లో ఫొటోలు తీసింది.
గౌరవ్ కుండిని రాయల్ అడిలైడ్ ఆసుపత్రికి తరలించగా.. మెదడు మరియు మెడ నరాలు దెబ్బతిని మరణించాడు.పోలీసులు సరైన పద్ధతిలో వ్యవహరించారని తాత్కాలిక అసిస్టెంట్ కమిషనర్ జాన్ డికాండియా, దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్ పీటర్ మలినౌస్కాస్ మద్దతు తెలిపారు.