తెలంగాణ

బ్రతికిన మళ్లీ తెలంగాణ కోసమే చస్తా .. అమరుడా నీకు “జోహార్లు”!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను విడిచారు. ఒక స్వరాష్ట్ర సాధన కోసం 2009లో ప్రత్యేకంగా మలిదశ ఉద్యమం జరిగింది. ఈ మలిదశ ఉద్యమంలో భాగంగా ఆత్మార్పణ చేసుకున్నటువంటి తొలి ఉద్యమకారుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు గుర్తు లేకపోయినా అప్పట్లో అతని వల్లే ఈ ఉద్యమం మరింత ఉధృతంగా మారింది. అతనే 2009లో స్వరాష్ట్ర సాధనకు మలిదశ ఉద్యమంలో ఆత్మార్పణ చేసుకున్న తొలి ఉద్యమకారుడు శ్రీకాంత్ చారి. ఈ శ్రీకాంత్ చారి ప్రత్యేక రాష్ట్రం కోసం అతని ఒంటికి నిప్పుంటించుకొని మరి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచాడు. అతను చనిపోయే కొద్ది క్షణాల ముందు కూడా మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరికి కూడా మనసును తాకాయి. చావు బ్రతుకుల్లోనూ బ్రతికిన మళ్ళీ తెలంగాణ కోసం చస్తానంటూ అతను చెప్పిన వ్యాఖ్యలు కోట్లాదిమందిలో ఉద్యమకాంక్షను రగిలించాయి. ఇతడి స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి నిప్పు కనికలై ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సహకారం చేసుకున్నారు. 2009 డిసెంబర్ మూడో తేదీన అంటే సరిగ్గా ఇదే రోజున శ్రీకాంతాచారి అమరుడయ్యారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆరోజు అతను ఇచ్చినటువంటి స్ఫూర్తిని అని చనిపోయిన కూడా నిన్ను మరువబోతూ ఈ తెలంగాణ గడ్డ చాలా మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

Read also : 20 Minute Marriage: అత్తింటికి వచ్చి 20 నిమిషాల్లోనే విడాకులు.. ఇదేం ట్విస్ట్ రా మావా?

Read also : High Court: మతం మారితే నో ఎస్సీ.. హైకోర్టు కీలక తీర్పు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button