ఆంధ్ర ప్రదేశ్

పెద్దారెడ్డిని చంపెందుకు జేసీ ప్లాన్! వణుకుతున్న తాడిపత్రి వైసీపీ

క్రైమ్ మిర్రర్, అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయాలు మంట పుట్టిస్తున్నాయి. వైసీపి నేతలు బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి రాకుండా ఆంక్షలు పెట్టడంతో వైసీపీ కేడర్ కూడా నియోజకవర్గం విడిచి వెళ్లారు.

కూటమి అధికారంలోకి వచ్చాక దాడులకు తెగబడుతోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. తాడిపత్రిలో టీడీపీ దాడులపై అనంతపురం జిల్లా ఎస్పీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు వినతి పత్రం అందజేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఆంక్షలు తొలగించాలని మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

తాడిపత్రి లో జేసీ హింసా రాజకీయాలు ఖండిస్తున్నామన్నారు. టీడీపీ దౌర్జన్యాలు, దాడులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేదన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీ అనుమతితో తాడిపత్రి వెళ్లినా దాడులు చేశారనీ..హామీలు అమలు చేయకుండా టీడీపీ నేతలతో దాడులు చేయిస్తున్నారనీ మండిపడ్డారు. టీడీపీ గూండాగిరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు.

Related Articles

Back to top button