క్రైమ్

నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త

హైదరాబాద్ లో క్రైమ్ రేట్ భారీగా పెరిగిపోతోంది. హత్యలు, అత్యాచార ఘటనలు, దొంగతనాల కేసులు పెరిగిపోతున్నాయి. కూకట్ పల్లిలో మహిళను మరో మహిళ అతి కిరాతకంగా చంపేసిన ఘటన మరవకముందే హైదర్ షాకోట్ లో మరో దారుణం జరిగింది. నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి చంపేశాడు కట్టుకున్న భర్త శ్రీనివాస్.కుటుంబ కలహాల తో భార్యను హత మార్చాడు కిరాతకుడు.

మృతురాలి బంధువులు, స్థానికుల చెప్పిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా భార్యను టార్చర్ చేస్తున్నాడు భర్త శ్రీనివాస్. పలు మార్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు భార్య, తన కుటుంబ సభ్యులు. అయినా అతని తీరు మారలేదు. రాత్రి మరోసారి భార్యతో గొడవపడ్డాడు. తర్వాత అందరూ నిద్రపోయారు. అర్దరాత్రి తర్వాత ఇంట్లో ఉన్న సుత్తితో నిద్రిస్తున్న భార్యను కొట్టి కిరాతకంగా హత్య చేశాడు భర్త శ్రీనివాస్. అనంతరం భార్యను చంపి పిల్లలతో పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు హంతకుడు. తన భార్య హ్యత చేసినట్టు పోలీసులకు చెప్పాడు శ్రీనివాస్.

హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న కాప్స్ ఆధారాలు సేకరింంచారు. రంగం లోకి దిగిన క్లస్ టీమ్ ఎవిడెన్స్ సేకరించాయి. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు పట్టించుకోక పోవడంతోనే హత్య జరిగిందని కాలనీ వాసులు, మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తల్లి హత్యకు గురికాగా.. ఆమెను చంపేసిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పిల్లలు ఒంటరివారయ్యారు. వాళ్లను చూసిన వాళ్లు కంటతడి పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button