తెలంగాణ

తెలంగాణ రైతులకు ఊరట.. యూరియా కేటాయింపు!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- రాష్ట్రంలోని రైతులకు ఎరువుల సమస్య నుంచి ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు కేటాయించింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచి యూరియా తరలింపునకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే వారం రోజుల్లో యూరియా రాష్ట్రానికి చేరుకునే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ప్రస్తుతం వర్షాకాల సాగు వేగంగా సాగుతున్న తరుణంలో రైతులకు ఎరువుల కొరత తీవ్ర సమస్యగా మారింది. పలు జిల్లాల్లో రైతులు యూరియా కోసం క్యూలలో నిలబడటంతో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించగా, తక్షణ కేటాయింపు ఆదేశాలు జారీ అయినట్లు మంత్రి వెల్లడించారు.

Read also : పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి.. నీటి విడుదల కొనసాగింపు!

తుమ్మల మాట్లాడుతూ యూరియా కొరతను అధిగమించేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు, రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువులు సమయానికి అందించేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కేంద్ర కేటాయింపుతో రైతులు ఉపశమనం పొందుతారని, వ్యవసాయ సీజన్‌లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ పంటలకు యూరియా కీలకంగా ఉపయోగపడుతుంది. ఈ సమయంలో లభించే సరఫరా రైతుల అవసరాలను తీర్చడంలో తోడ్పడనుంది. కేంద్ర నిర్ణయం రైతాంగానికి కొంత ఊరట కలిగిస్తోందని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు.

Read also :పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి.. నీటి విడుదల కొనసాగింపు!

Back to top button