జాతీయం

తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు !

తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు కాబట్టి. ప్రతిరోజు కూడా కొన్ని లక్షల్లో స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. తాజాగా టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరులో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురవడం వల్ల తిరుమల లో స్వామివారి దర్శనానికి అడ్డంకులు కలుగుతున్నాయి. కాబట్టి టిటిడి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజున విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ నిర్ణయించింది.

రాబోయే రెండు రోజులు కూడా భారీ నుండి అది భారీ వర్షాలు కురుస్తాయి అన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దయచేసి అందరూ కూడా గమనించాలని కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా,చిత్తూరు, నెల్లూరు వంటి నగరాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ద్వారా దాదాపుగా ఐదు రోజుల నుండి వర్షాలు కురుస్తున్నయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button