
క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో : మర్రిగూడ మండలం, ఇందుర్తి మేటి చందాపూర్ గ్రామానికి చెందిన ఊరుపక్క మల్లయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లయ్య పరిస్థితిని తెలుసుకున్న బీఆర్ఎస్ నేత అయితగోని యాదగిరి గౌడ్ సోమవారం ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మల్లయ్య కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అండగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో వనం యాదగిరి, అయితగోని రఘు, అయితగోని గణేష్ తదితరులు పాల్గొన్నారు. సహాయానికి ముందుకు వచ్చిన నేతలకు మల్లయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేద కుటుంబాలకు అండగా ఉండేందుకు నాయకులు ముందుకు రావడం హర్షణీయమని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.