
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కారు పార్టీలో కల్లోలం రేపిన కవిత… మైకుల ముందు ఎందుకు కామ్ అయ్యారు..? చిట్చాట్లో కేటీఆర్, హరీష్రావును టార్గెట్ చేసిన ఆమె… మీడియా ముందుకు వచ్చే సరికి… ఎందుకు నోరు మెదపలేదు..? సోదరుడు కేటీఆర్ కుట్రలను ఎందుకు బయట పెట్టలేకపోయారు…? కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో ఎందుకు చెప్పలేకపోయారు..? ఆమె భయపడ్డారా…? లేక.. ఎవరైనా భయపెట్టారా…? ఏమో.. తెలియదు గానీ.. తెలంగాణ జాగృతి కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా.. బీఆర్ఎస్పై విమర్శలు చేయకుండా.. తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేసి వెళ్లిపోయారు కవిత.
కవిత లేఖ బయటపడినప్పటి నుంచి కారు పార్టీ పరువు బజారున పడింది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్న కవిత వ్యాఖ్యలు… కారు పార్టీని కలవర పెట్టాయి. ఆ దెయ్యాలు ఎవరు అన్న దానిపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరిగింది. దీంతో… రోజుకో చిట్చాట్ పెడుతూ… దెయ్యాల గురించి చెప్పకనే చెప్పారు కవిత. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసేందుకు జరిపిన చర్చల విషయం బయటపెట్టి… అన్న కేటీఆర్ను టార్గెట్ చేశారు. ఆ తర్వాత… బీజేపీ నేత రఘునందన్ కూతురి ఆస్పత్రి ఓపెనింగ్కు వెళ్లింది ఎవరు అంటూ ప్రశ్నించి.. హరీష్రావును టార్గెట్ చేశారు. ఇంత చేస్తున్నా… కేసీఆర్ మౌనంగానే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కేసీఆర్ ఆదేశాలతో… కవితపై బీఆర్ఎస్ నేతలు పెద్దగా నోరు పారేసుకోలేదు.. కౌంటర్లు ఇవ్వలేదని సమాచారం.
కట్ చేస్తే… తెలంగాణ జాగృతి పేరుతో కొత్త ఆఫీసును ప్రారంభించారు కవిత. ఆ సమయంలో… ఆమె బీఆర్ఎస్పై భగ్గుమంటారని అంతా అనుకున్నారు. కేటీఆర్ కుట్రలను మీడియా ముఖంగా బయటపెడతారని భావించారు. కానీ.. అలా జరగేలేదు. అసలు.. బీఆర్ఎస్పై విమర్శలు చేయలేదు కవిత. అంటే… ఆమె భయపడ్డారా…? లేక… ఎవరైనా భయపెట్టారా…? లేక.. కేసీఆర్ ఆమెను వారించారా…? ఏమో ఏదైనా కావొచ్చు. అందుకే పార్టీ కుట్రల జోలికి వెళ్లలేదు… అయితే… కారు పార్టీతో డైరెక్ట్గా కటీఫ్ చెప్పకుండా.. వేరు కొంపటి పెట్టుకున్నట్టు మెసేజ్ మాత్రం ఇచ్చారు కవిత.
తెలంగాణ జాగృతితోనే తాను ముందుకెళ్తున్నట్టు.. స్పష్టం చెప్పేశారు కవిత. కేసీఆర్కు బీఆర్ఎస్కు ఒక కన్ను అయితే… జాగృతి మరో కన్నులా ఉంటుందన్నారు. అంటే బీఆర్ఎస్తో కలిసి పనిచేయనని చెప్పేసినట్టేగా. జాగృతి పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నట్టేగా. కవిత ఇంటి దగ్గర కనిపించిన కొత్త జెండాలు… జాగృతి ఆఫీసులో కనిపించిన బ్యానర్లు.. జాగృతి పేరుతో కవిత పెట్టుకున్న కొత్త కుంపటికి నిదర్శనాలేగా. తెలంగాణ రాజకీయాల్లో.. ఇప్పుడు ఇదే హాట్ హాట్ చర్చ.
అంతేకాదు.. బీఆర్ఎస్ తరపున కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు.. ప్రజాఉద్యమాలు చేయడంలో ఫెయిల్ అయ్యారని కవిత చెప్పకనే చెప్పేశారు. అందుకే… తెలంగాణ జాగృతి పేరుతో ఆమె ఉద్యమాలకి సిద్ధమవుతున్నారు. కాళేశ్వరం కమిషన్… కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై… జూన్ 4న మహాధర్నా చేపట్టారు కవిత. కేసీఆర్ జోలికి వస్తే ఊరుకోమని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడే కాదు.. ఆరు గ్యారెంటీలు, విద్యార్థుల సమస్యలు, నీటి వాటాల లెక్కలు తేలే వరకు.. జాగృతి తరపున ప్రశ్నిస్తాం. ఉద్యమిస్తామని.. క్లియర్ కట్గా చెప్పేశారు కవిత. అంటే.. ఇకపై బీఆర్ఎస్ వేరు… తెలంగాణ జాగృతి వేరు అన్నది.. అందరికీ అర్థమైంది.