తెలంగాణ

ఓవైసీ కాలేజీలో ఫ్యాకల్టీగా ఉగ్రవాదులు! బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ఒవైసీ బ్రదర్స్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్. 15 నిమిషాలు కేటాయిస్తే నరికి చంపుతాన్నన ఓవైసీ కి ఏం ఫోబియా ఉందన్నారు. హిందూ దేవుళ్ళను కించపరిచే ఒవైసీకి ఏం ఫోబియా ఉందని ప్రశ్నించారు బండి సంజయ్. ఎంఐఎం నేతలు ఇప్పటికీ జాతీయ గీతం ఆలపించరని చెప్పారు. ఓల్డ్ సీటు న్యూ సీటిగా మారుస్తానన్న వ్యాఖ్యలను ముస్లిం పెద్దలే సమర్థించారని తెలిపారు.
ఓవైసీ కాలేజీలో ఫ్యాకల్టీ ఉగ్ర వాదిగా పట్టుబడ్డారని బండి సంజయ్ అన్నారు.

సెక్యులర్ అనేవాళ్ళు హిందువుల పండుగ ఏనాడైనా జరుపుకున్నారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఉగ్రవాదులను పెంచి పోషించేది ఎంఐఏం పార్టీ అన్నారు. వన్ నేషన్ , వన్ ఎలక్షన్ కి కేంద్రం కట్టుబడి ఉందన్నారు బండి. కేటీఆర్ కి మీడియా ఫోబియా ఉందన్నారు.
అమృత్ పథకం అక్రమాలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారిస్తుందని తెలిపారు.బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఓటుకు నోటుకు కేసు విచారణ ఎందుకు జరపలేదని అన్నారు. కాంగ్రెస్ – బిఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని బండి సంజయ్ ఆరోపించారు. కొంతమంది కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. హైడ్రాకి బీజేపీ వ్యతిరేకం కాదన్న సంజయ్.. నిష్పాక్షికంగా కూల్చివేతలు జరగాలన్నారు.
అక్రమ కట్టడాలకు కారణమైన బిఆర్ ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తిరుపతి లడ్డూ లో కల్తీ హిందూ ధర్మం పై దాడి అన్నారు బండి సంజయ్. తిరుపతి లడ్డు లో కల్తీ హిందువుల మనోభావాలు ను దెబ్బ తీయడమే అన్నారు. పవిత్రమైన తిరుమల ప్రసాదంలో ఆరోపణలు రావడం సిగ్గు చేటు అన్నారు. తిరుమల లడ్డు కల్తీ వివాదంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దృష్టి సారించారని తెలిపారు. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని..తిరుపతి లడ్డు పట్ల ఎలాంటి సందేహాలు వద్దన్నారు. టీటీడీ లో అన్యమతస్తులకు చోటు కల్పించకూడదన్నారు. గతంలోనే టీటీడీ లో అన్యమతస్తుల విషయంలో ఫిర్యాదు చేశామన్నారు బండి సంజయ్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button