జాతీయం

అయ్యప్ప స్వాములకు కేరళ ప్రభుత్వం షాక్

అయ్యప్ప భక్తులకు షాకింగ్ న్యూస్ చెప్పింది కేరళ రాష్ట్ర ప్రభుత్వం. శబరిమలలో అయ్యప్ప దర్శనానికి సంబంధించి కీలక మార్పులు చేసింది. గతంలో మాదిరి కాకుండా దర్శనంపై పలు ఆంక్షలు విధించింది. శబరిమల అయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ బుకింగ్ ద్వారానే దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. గరిష్టంగా రోజుకు 80 వేల మందికి అయ్యప్ప స్వాములకు మాత్రమే దర్శనం కల్పిస్తామని ట్రావెన్ కోర్ ఆలయ అధికారులు తెలిపారు.

వర్చువల్ క్యూబుకింగ్ సమయంలో భక్తులు తమ ప్రయాణా మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని శబరిమల అయ్యప్ప ఆలయ అధికారులు వెల్లడించారు. మూడు నెలల ముందే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. గతంలో 10 రోజుల ముందు మాత్రమే బుకింగ్ సదుపాయం ఉండేది. ఇపుడు దాన్ని మూడు నెలల వరకు పెంచింది ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు. శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా బుక్ చేసుకున్నవారికి దర్శన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది.

2023 డిసెంబర్ మండల పూజల సమయంలో శబరిమలకు భక్తులు భారీగా వచ్చారు. రద్దీ విపరీతంగా ఉండటంతో కొందరు భక్తులు అయ్యప్ప దర్శనం కాకుండానే తిరిగొచ్చారు.దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.భక్తులకు దర్శనం కల్పించడంలో ట్రావెన్ కోరు బోర్డ్ విఫలమైందనే విమర్శలు వచ్చాయి. దీంతో కేరళ ప్రభుత్వం ఈ ఏడాది రూల్స్ మార్చేసింది.ఆన్ లైన్ ద్వారా రోజుకు 80 వేల వరకు మాత్రమే దర్శనాలు ఉండేలా చర్యలు చేపట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button