![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/IMG-20250213-WA0023-780x470.jpg?lossy=1&strip=1&webp=1)
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి 14 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యారంగానికి కనీసం ఒక మంత్రిని నియమించకుండా జాప్యం చేస్తూ విద్యారంగాన్ని గాలికి వదిలేసి. రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారనీ, రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది అని ఎటువంటి పట్టింపులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నామమాత్రంగా వ్యవహరిస్తూ చేతులు దులుపుకుంటున్నది అని వారు కాంగ్రెస్ ప్రభుత్వం పై ద్వజమెత్తారు.
ఒకపక్క గురుకుల విద్యాలయాల లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు మరణిస్తుంటే మరోపక్క ప్రభుత్వ విద్యాసంస్థలన్నీంటిలో అర కొర సౌకర్యాలు, అధ్యాపకుల లేమి, మంచినీరు సమస్య, సరిపోనీ తరగతి గదులు, శిధిలావస్థలో బిల్డింగులు, అద్దె భవనాల్లో విద్యాసంస్థల నిర్వహణ లాంటి లోపాలతో ప్రభుత్వ విద్యా సంస్థలు కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వ చేయూత ఏమాత్రం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ విద్యాసంస్థల నిర్వహణకు ఉద్యోగుల జీతభత్యాలు కూడా సరిపోని పరిస్థితి ఉన్నదని అన్నారు అదే విధంగా ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే కొత్త సీసాలో పాత సార చందంగా విద్యార్థులకు పాత సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు తోడై స్వాగతం పలుకుతున్నాయని అన్నారు. అంతేకాకుండా సంవత్సరాల తరబడి స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయకుండా వేల కోట్ల రూపాయలను పెండింగ్ లో ఉంచి విద్యార్థులకు మొండి చేయి చూపిస్తున్నారని తెలిపారు. విద్యారంగంలో కొంతమేరకైనా సమస్యలు పరిష్కరించబడాలి అంటే కొఠారి కమిషన్ సూచించిన మేరకు రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల చిత్తశుద్ధి చాటుకోవాలని వారి డిమాండ్ చేశారు.
బర్డ్ ఫ్లూతో మనిషి మృతి.. చికెన్ తింటే మీరు అవుటే
విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల నూతన ముసాయిదాను ప్రవేశపెట్టి వీసీల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే వ్యక్తులను వైస్ ఛాన్స్లర్ గా నియమించి విశ్వవిద్యాలయాలలో కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు కుట్రలో భాగంగానే నూతన ముసాయిదాను తీసుకొచ్చిందని దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించి చేతులు దులుపుకోవడం కాకుండా అడ్డుకోవాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో గొల్లపల్లి మాజీ ఎంపీటీసీ ఆవుల సత్యం , చెందోలి మాజీ సర్పంచ్ అలిశెట్టి రవీందర్ గొల్లపల్లి మాజీ ఉప సర్పంచ్ కానుకుంట్ల లింగారెడ్డి BRS పార్టి సీనియర్ నాయకులు కనుకుంట్ల లింగారెడ్డి, దావుల రాకేష్ BRS కార్మిక విభాగం మండల అధ్యక్షులు సమల వీరస్వామి BRSV మండల ఉపాధ్యక్షులు చింతకుంట శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.