HomeతెలంగాణWeather updates: మరో అల్పపీడన భయం.. తెలంగాణలో వర్షాలకు ఛాన్స్

Weather updates: మరో అల్పపీడన భయం.. తెలంగాణలో వర్షాలకు ఛాన్స్

Weather updates: తెలుగు రాష్ట్రాలకు సెన్యార్ తుపాను వల్ల ఎలాంటి ప్రమాదం లేదని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇండోనేషియా సమీపంలోని మలక్కా జలసంధి వద్ద ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం సాయంత్రానికి సెన్యార్ అనే తుఫానుగా బలపడింది. పశ్చిమ దిశగా కదులుతూ ఇది ఇండోనేషియా తీరాన్ని తాకిన వెంటనే తీవ్ర గాలులు, భారీ వర్షాలు కురిపించింది. తుఫాను తీవ్రత ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగినా.. అనంతరం క్రమంగా బలహీనపడతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ తుఫాను దిశ మారి మలేషియా వైపు కదలడం ప్రారంభించడంతో భారత భూభాగంపై దీని నుండి ఎలాంటి ప్రభావం ఉండదని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇండోనేషియా తీరం దాటిన వెంటనే సెన్యార్ శక్తి పూర్తిగా తగ్గిపోతుందని కూడా అభిప్రాయపడ్డారు.

ఇక తెలుగు రాష్ట్రాలకు అసలు ప్రభావం చూపే వ్యవస్థ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనమని అధికారులు చెబుతున్నారు. శ్రీలంక సమీపంలో కొనసాగుతున్న ఈ అల్పపీడనం దశలవారీగా ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఈ రోజు వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వాయుగుండం శనివారం నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వచ్చే రెండు మూడు రోజుల్లో వర్షాలకు ప్రధాన కారణం కానుందని తెలిపారు. ప్రత్యేకంగా శనివారం ఆదివారం రోజుల్లో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వాతావరణ మార్పుల కారణంగా ఈ రోజు రాత్రికల్లా రెండు రాష్ట్రాల్లో మేఘాలు ఆవరించనున్నాయి. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో మేఘావరణం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ రోజు తెలంగాణలో వర్షం పడే అవకాశం తక్కువగా ఉండగా, చలికూడా తగ్గుముఖం పడుతుందని అనుమానిస్తున్నారు. అయితే శనివారం నుండి మళ్లీ వర్షాలు ప్రారంభమై ఆదివారం వరకూ కొనసాగే అవకాశం ఉంది. మొత్తం మీద రాబోయే 2, 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం తీవ్రత పెరుగుతుందని స్పష్టమవుతోంది. ఈ వర్షాల పరిమాణం, ప్రభావం అన్నీ శ్రీలంక సమీపంలోని వాయుగుండం కదలికపైనే ఆధారపడి ఉంటాయని అధికారులు చెప్పారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.

ALSO READ: Hong Kong: భారీ అగ్నిప్రమాదం.. 44 మంది మృతి.. 45 మందికి గాయాలు

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు