Wednesday, March 18, 2026
HomeతెలంగాణVillage Politics: స్థానిక సమరంలో హస్తం హవా

Village Politics: స్థానిక సమరంలో హస్తం హవా

Village Politics: తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి బలమైన ఆధిక్యాన్ని అందిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం జరిగిన చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగడంతో లెక్కింపు ప్రక్రియ కాస్త నెమ్మదిగా సాగుతున్నప్పటికీ, అందుతున్న ప్రారంభ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ దూకుడును స్పష్టంగా చూపిస్తున్నాయి.

ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,753 సర్పంచ్ పదవులు, 28,410 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. చాలా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల లెక్కింపు పూర్తవుతుండగా, కొన్ని కీలక గ్రామాల్లో మాత్రం ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

ఇప్పటి వరకు అధికారికంగా అందిన సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 540 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించింది. అధికార బీఆర్ఎస్ పార్టీ 170 సర్పంచ్ స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 45 స్థానాల్లో మాత్రమే పరిమితమైంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా గణనీయంగా ప్రభావం చూపుతూ ఇప్పటివరకు 126 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించినట్లు తెలుస్తోంది. ఇంకా లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సంఖ్యల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది.

వార్డు సభ్యుల ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఎక్కువ గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల లెక్కింపు పూర్తైన గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికలను కూడా ఎన్నికల అధికారులు వెంటనే నిర్వహిస్తున్నారు. ఈ ఉప సర్పంచ్ పదవుల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధిక సంఖ్యలో స్థానాలను కైవసం చేసుకుంటున్నట్లు సమాచారం.

మొదటి, రెండో, మూడో విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే జోరు చివరి విడతలోనూ కొనసాగుతుండటంతో గ్రామీణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం మరింత బలపడినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోయినా.. ఆయా పార్టీల మద్దతు ఉన్న అభ్యర్థులే ఎక్కువగా గెలుపొందుతుండటం గమనార్హం.

బ్యాలెట్ పత్రాల ద్వారా ఓటింగ్ జరగడం వల్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యమవుతోంది. కొన్ని ప్రధాన గ్రామ పంచాయతీల్లో అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పంచాయతీ ఎన్నికల ఫలితాలతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. గెలిచిన అభ్యర్థుల మద్దతుదారులు సంబరాలు చేసుకుంటుండగా, మరికొన్ని చోట్ల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా చివరి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ గ్రామీణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఊపునిచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ALSO READ: Illegal Relationship: ఆగలేక భార్య శృంగారం.. తర్వాత విషాదం..!

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు.డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు.క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments