
పెళ్లి వేడుక అంటే సంప్రదాయం, ఆచారం, భావోద్వేగాల సమ్మేళనం. కానీ తాజాగా ఓ వివాహ వేడుకలో చోటు చేసుకున్న సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పెళ్లి మండపంలో వధూవరులు చేసిన చర్యలు హద్దులు దాటాయా లేదా ఆధునిక భావోద్వేగాల ప్రతిబింబమా అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సంప్రదాయం వర్సెస్ ఆధునికత అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.
Panditji stopped the groom and bride from kissing on the stage.
Feminist girls will say he’s a bad person.
But he is old, he grew up with religion and values. He was brought there to conduct their marriage and he did so.
Society has changed, while he still holds his values. pic.twitter.com/Z1WmbRo8Wq
— ︎ ︎venom (@venom1s) January 29, 2026
ఈ పెళ్లి వేడుకలో వధూవరులు వినూత్నంగా మండపంపైకి ప్రవేశించారు. సాధారణంగా కనిపించే ప్రవేశానికి భిన్నంగా వధువు మెల్లగా నడుచుకుంటూ ముందుకు రాగా, వరుడు మోకాళ్లపై వంగి ఆమెకు పూలగుత్తి అందించాడు. ఈ దృశ్యం అక్కడున్న అతిథులను ఆకట్టుకుంది. కొందరు ఇది ఎంతో రొమాంటిక్ గా ఉందని ప్రశంసించారు. ఈ వినూత్న ప్రవేశం తర్వాత వేదికపై వాతావరణం భావోద్వేగంగా మారిపోయింది.
అనంతరం వధూవరులు తమ భావాలను అదుపు చేసుకోలేకపోయారు. అందరి సమక్షంలోనే ఇద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన అతిథులు చప్పట్లతో ప్రోత్సహించడంతో వారి భావోద్వేగాలు మరింత ఉప్పొంగాయి. ఆ క్రమంలో వరుడు వధువు చెంపపై సున్నితంగా ముద్దుపెట్టాడు. ఇది చూసిన కొందరు అతిథులు మరింత ఉత్సాహంగా స్పందించడంతో ఆ జంట మళ్లీ ఒకరినొకరు ఆలింగనం చేసుకునేందుకు సిద్ధమైంది.
అయితే ఈ దృశ్యాలు పెళ్లి పూజారికి ఆగ్రహం తెప్పించాయి. సంప్రదాయ వివాహ వేడుకలో ఇలాంటి ప్రవర్తన అనుచితమని భావించిన ఆయన.. వెంటనే వేదికపైకి వచ్చి వధూవరులను విడదీశారు. అంతేకాదు ఈ చర్యను ప్రోత్సహించిన అతిథులపై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో వధువు నిరాశగా పక్కకు వెళ్లినట్లు వీడియోలో కనిపించింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వధువే తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇది మరింత వైరల్ అయింది. కొద్ది గంటల్లోనే లక్షలాది మంది ఈ క్లిప్ ను వీక్షించడంతో పాటు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాహ వేడుక ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై నెటిజన్ల అభిప్రాయాలు రెండు వర్గాలుగా విడిపోయాయి. ఒక వర్గం పూజారి చర్యను సమర్థిస్తోంది. పెళ్లి అనేది పవిత్రమైన ఆచారం అని, మండపంలో సంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత వధూవరులపై ఉందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. వివాహ వేడుకలో హద్దులు దాటితే సంప్రదాయ విలువలకు భంగం కలుగుతుందని ఈ వర్గం అభిప్రాయపడుతోంది.
మరోవైపు మరో వర్గం మాత్రం వధూవరుల చర్యకు మద్దతు ఇస్తోంది. వివాహంతో ఒకటవుతున్న తరుణంలో తమ ప్రేమను వ్యక్తపరచుకోవడంలో తప్పేముందని ప్రశ్నిస్తోంది. ఇది వారి వ్యక్తిగత భావోద్వేగమని, దానిని తప్పుబట్టడం సరికాదని అంటోంది. కాలానికి అనుగుణంగా సంప్రదాయాలు కూడా మారాల్సిన అవసరం ఉందని ఈ వర్గం అభిప్రాయపడుతోంది.
ALSO READ: ఒక వ్యక్తి నిద్రపోవడానికి ఎంత సమయం పడుతుంది?





