Thursday, March 19, 2026
Homeఆంధ్ర ప్రదేశ్VIDEO: మరీ ఇంత కరువా? అర్ధరాత్రి అమ్మాయిల హాస్టళ్లోకి చొరబడి..

VIDEO: మరీ ఇంత కరువా? అర్ధరాత్రి అమ్మాయిల హాస్టళ్లోకి చొరబడి..

తిరుపతి నగరంలో అర్ధరాత్రి ఓ దొంగ చేసిన హల్ చల్ స్థానికంగా కలకలం రేపింది. మహిళా విద్యార్థినులు ఉంటున్న లేడీస్ హాస్టళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగుడు నిర్భయంగా లోపలికి చొరబడి సెల్ ఫోన్లను చోరీ చేసి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు హాస్టళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

భవానీ సర్కిల్ సమీపంలో ఉన్న రెండు లేడీస్ హాస్టళ్లలో ఈ ఘటన చోటుచేసుకోవడం భద్రతపై తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. రాత్రి నిశ్శబ్ద సమయంలో హాస్టళ్లలోకి ప్రవేశించిన దొంగ.. గదుల వద్ద తిరుగుతూ విద్యార్థినుల సెల్ ఫోన్లను అపహరించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. ఈ ఘటనలో ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న పలువురు విద్యార్థినులకు చెందిన ఫోన్లు చోరీకి గురైనట్లు సమాచారం.

మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన విద్యార్థినులు తమ ఫోన్లు కనిపించకపోవడంతో ఒక్కసారిగా హాస్టళ్లలో కలవరం చెలరేగింది. వెంటనే సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా దొంగ రాత్రిపూట హాస్టళ్లలోకి ప్రవేశించి నిర్లక్ష్యంగా తిరుగుతూ ఫోన్లు తీసుకెళ్లిన దృశ్యాలు బయటపడ్డాయి. దీంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై వెంటనే తిరుపతి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

నగరంలో మహిళా హాస్టళ్ల భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రాత్రివేళ భద్రతా సిబ్బంది పర్యవేక్షణ పెంచాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పోలీసులు త్వరలోనే నిందితుడిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ALSO READ: BIG NEWS: తిరుమల ఆలయం వద్ద మహా అపచారం

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు.డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు.క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments