
మద్దూర్ ,(క్రైమ్ మిర్రర్ ప్రతినిధి) :-
నారాయణపేట జిల్లా లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. అసలు విషయానికి వస్తే నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండల పరిధిలో పెదిరిపాడు గ్రామ శివారులో ఉన్న శివాలయం దేవాలయం దగ్గర ఎదురుగా ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఉన్న వ్యక్తిని గ్రామస్తులు చూసి షాక్ అయ్యారు. అయితే ఆ వ్యక్తి మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉంది. అంతేకాకుండా బాగా దుర్వాసన రావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకోవాల్సి ఉంది. అమృతదేహం పట్ల ఎటువంటి సమాచారం అయితే ప్రస్తుతం అందలేదు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Raed more
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలెర్ట్… భారీ వాహనాలకు అనుమతి లేదు?