
ఉత్తరప్రదేశ్లో మరో విచిత్ర ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. న్యాయవాదుల సమక్షంలో ఒక మహిళ.. మరో మహిళ మెడలో తాళి కట్టింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.తమకు పురుషులు అంటే ఇష్టం లేదని.. మూడు నెలల నుండి కలిసి ఉన్నామని పెళ్లి చేసుకున్నారు ఇద్దరు మహిళలు. బదాయూ కోర్టు ప్రాంగంణంలోని శివాలయంలో దండాలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు ఇద్దరు మహిళలు.