Homeఅంతర్జాతీయంబీబీసీకి ట్రంప్‌ మరో షాక్‌

బీబీసీకి ట్రంప్‌ మరో షాక్‌

అమెరికాలో జరిగిన క్యాపిటల్ హిల్ దాడి సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని బీబీసీ సంస్థ తమ డాక్యుమెంటరీ కోసం ఎడిటింగ్ చేస్తూ అసలు భావానికి భిన్నంగా మారుస్తూ ప్రసారం చేయడంతో పెద్ద వివాదం రేగింది. ట్రంప్ ఆ ఎడిటింగ్ తమ ప్రతిష్ఠను దెబ్బతీసిందని ఆరోపిస్తూ మీడియా సంస్థపై భారీ ఆరోపణలు చేశారు. తన వ్యాఖ్యలు తప్పుగా చూపించే విధంగా మార్పులు చేయడం ద్వారా ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు కలిగించారని, ఆ విషయంలో బీబీసీ స్పష్టమైన తప్పు చేసిందని ఆయన వాదన. ఈ తప్పిదం వల్ల పరువు నష్టం జరిగిందని, ఆ నష్టానికి బదులుగా సంస్థ బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆయన న్యాయబృందం ఇప్పటికే లేఖ రాసింది.

బీబీసీ దీనిపై క్షమాపణలు చెప్పినా ట్రంప్ డిమాండ్లను అంగీకరించేందుకు మాత్రం సుముఖంగా లేదు. తమ ఎడిటింగ్ వల్ల ఆయనకు నష్టం కలిగిందని ఒప్పుకుంటూనే ఆయన కోరిన భారీ మొత్తాన్ని చెల్లించలేమని సంస్థ స్పష్టం చేయడంతో వివాదం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి హెచ్చరికలు చేస్తూ వచ్చే వారంలోనే ఆ సంస్థపై బిలియన్ డాలర్ నుంచి ఐదు బిలియన్ డాలర్ల వరకు దావా వేయనున్నట్లు ప్రకటించారు. ఈ సమస్యపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో కూడా చర్చించనున్నట్లు తెలిపారు.

క్యాపిటల్ హిల్ ఘటన రోజున ట్రంప్ దాదాపు గంటసేపు ప్రసంగించాడు. బీబీసీ తమ పనోరమ డాక్యుమెంటరీ కోసం ఆ ప్రసంగాన్ని తప్పుగా ఎడిట్ చేసి చూపించడంతో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. దీనిపై రాజకీయ పార్టీలతో పాటు మీడియా వర్గాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశాయి. ట్రంప్ తరపున పలు నేతలు కూడా దీనిపై గట్టిగా స్పందించడంతో బీబీసీకి అంతర్గతంగా ఒత్తిడులు పెరిగాయి. చివరకు బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ టర్నెస్ డెబోరా రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఈ అన్ని పరిణామాల తర్వాత కూడా బిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వాలని ట్రంప్ నొక్కి చెబుతుండగా బీబీసీ మాత్రం దానిని తిరస్కరించింది. ట్రంప్‌కు వ్యక్తిగతంగా లేఖ రాసిన చైర్మన్ సమీర్ షా ఈ సంఘటనపై చింత వ్యక్తం చేస్తూ కొన్ని తప్పులు జరిగాయని అంగీకరించినా, డిమాండ్ చేసిన పరిహారం చెల్లించడం సాధ్యపడదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యం వల్ల ట్రంప్ మరోసారి హెచ్చరికలు చేస్తూ, అవసరమైతే కోర్టు మార్గం తప్ప మరొకటి లేదని తెలిపారు. బీబీసీపై భారీ దావా వేయడానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేయడంతో ఈ వివాదం త్వరలోనే మరో కొత్త దశలోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ALSO READ: CM Stalin: బిహార్ ఫలితం.. ఇండియా కూటమికి పాఠం

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు