- అసెంబ్లీలో డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్
అమరావతి, క్రైమ్మిర్రర్: కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై శాసనసభలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. కల్తీనెయ్యిలో ఏ రసాయనాలు వాడారో ఆ పెరుమాళ్లకే తెలియాలి. జంతు సంబంధ రసాయనాలు ఉన్నాయని ఎన్డీడీబీ రిపోర్టు చెప్పింది. అది నెయ్యే కాదని సీబీఐ రిపోర్టు ఇచ్చిందన్నారు.
ఇది ధర్మానికి సంబంధించిన విషయం. సకల మతాలను గౌరవించడం ఈ దేశ సంస్కృతి అన్నారు. తితిదే పాత బోర్డును జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అంటే ఆయనకూ భాగం ఉన్నట్టే కదా?‘ అని పవన్ అన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి ఉపయోగించలేదని ఇప్పటికే తేలిపోయిందన్నారు. నెయ్యిలో రసాయనాలు కలవలేదని వైసీపీ అబద్దాలు చెబుతోందని.. అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వచ్చిందని పవన్ తెలిపారు.

