
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లా పర్యటనకు హెలికాప్టర్లో వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడ జగన్ హెలికాప్టర్ గాని ఒక్కసారిగా భారీగా జనం హెలికాప్టర్ చుట్టూ చేరిపోయారు. దీంతో అక్కడి హెలికాప్టర్ స్వల్పంగా ధ్వంసం అయింది. ఈ విషయం దాదాపు మూడు నాలుగు రోజులపాటుగా రాజకీయ కోణంలో బాగానే సంచలనం సృష్టిస్తూ అన్ని సోషల్ మీడియాలలో వైరల్ అయింది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే పైలెట్ తిరిగి జగన్ ను తీసుకెళ్లకుండా ఒకరే హెలికాప్టర్ తో పాటు వెళ్లిపోయాడు. దీంతో ఈ వ్యవహారం అనేది అప్పట్లో సంచలనంగా మారింది. ఇలా ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్కడికక్కడే వదిలేసి వెళ్లిపోవడానికి గల కారణాలు ఏంటి అని చాలామంది కూడా ఆలోచించారు. అయితే ఈ తాజాగా ఆ ఫైలెట్ ను పోలీసులు విచారించగా అసలు నిజాలు వెల్లడించారు.
ఫైలెట్ అనిల్ కుమార్ పోలీసులు విచారించిన కస్టడీలో సంచల వివరాలు బయటపెట్టారు. ఏప్రిల్ 8వ తారీఖున సత్య సాయి జిల్లాలో జగన్మోహన్ రెడ్డిని అక్కడికక్కడే వదిలేసి వెళ్లిపోవడానికి గల కారణాలను పైలెట్ అనిల్ వెల్లడించారు. ఆ పరిస్థితులలో అక్కడికి భారీగా జనం రావడంతో హెలికాప్టర్ ధ్వంసం అయింది. హెలికాప్టర్ వద్దకు భారీగా చేరుకున్న జనం జగన్మోహన్ రెడ్డిని పలకరించడానికి హెలికాప్టర్ ముందు భాగం అద్దాలపై పిడుగుద్దులతో గుద్దగా… హెలికాప్టర్ ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో జగన్మోహన్ రెడ్డిని తిరిగి తీసుకెళ్లే సమయంలో ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అని ఊహించి జగన్ను తీసుకెళ్లకుండా అక్కడే వదిలేసి తిరిగి నేను హెలికాప్టర్ తీసుకెళ్ళాను అంటూ పైలట్ చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ఏవియేషన్ సంస్థకు కూడా చెప్పానని… అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతోనే నేను వెళ్ళిపోయినట్లు పైలెట్ అనిల్ తెలిపారు. కానీ పోలీసులు మాత్రం జగన్ లేకుండా నువ్వు ఒక్కడివే వెళ్ళినా ప్రమాదం జరిగి ఉంటే ఏమయ్యాది అని ప్రశ్నించగా… మేము హెలికాప్టర్ ముందు భాగంలో ఉంటాం కాబట్టి కనీస సామాగ్రి జాబితాలో మేము టేక్ ఆఫ్ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. కాబట్టి మాకు ఎటువంటి ప్రమాదం ఉండదు కాబట్టి అలా వెంటనే వెళ్ళిపోయినట్లు వెల్లడించారు. దీంతో పోలీసులు కూడా దీనిపై న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.