ఇంతకన్నా దారుణం ఇంకేమీ ఉండదేమో.. బాలికపై తండ్రి, మేనమామ అత్యాచారం

ఆంధ్రప్రదేశ్‌లో మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసే అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసే అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మైనర్ బాలికపై ఆమె కన్నతండ్రి, మేనమామ లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. కుటుంబమే రక్షణగా ఉండాల్సిన స్థితిలో, అదే కుటుంబ సభ్యులు మృగాలుగా మారడం సమాజాన్ని ఆలోచనలో పడేస్తోంది. ఈ ఘటనలో బాధిత బాలిక గర్భం దాల్చడం మరింత విషాదకరంగా మారింది. ఆలస్యంగా బయటపడిన ఈ విషయం స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని ఒక గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ తరచూ పాఠశాలకు రాకపోవడంతో ఉపాధ్యాయురాలికి అనుమానం వచ్చింది. బాలిక ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో, ఉపాధ్యాయురాలు ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడ వైద్యులు చేసిన పరీక్షల్లో బాలిక గర్భవతి అని తేలడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయురాలు బాలికను మృదువుగా ప్రశ్నించగా, సెలవుల సమయంలో ఇంటికి వెళ్లినప్పుడు తనపై కన్నతండ్రి, మేనమామ లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక వెల్లడించింది. చిన్న వయసులోనే తాను ఎదుర్కొన్న బాధను కన్నీళ్లతో వివరించిన బాలిక మాటలు విన్నవారిని కంటతడి పెట్టించాయి. ఈ ఘటన బయటకు రావడంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

సమాచారం అందుకున్న జిల్లా అధికారులు వెంటనే స్పందించినట్టు తెలుస్తోంది. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టిన అధికారులు, బాధిత బాలికకు అవసరమైన వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందించే చర్యలు తీసుకుంటున్నారు. అలాగే నిందితులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అధికార యంత్రాంగం కదులుతున్నట్టు సమాచారం. సమాజంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు, కఠిన అమలు అవసరమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ: ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీ చేతికి రూ.72 లక్షలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button