
క్రైమ్ మిర్రర్,నిర్మల్:- నిర్మల్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారులకు అవసరమైన మరమ్మత్తులను తక్షణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జాతీయ రహదారి అధికారులతో జరిగిన సమావేశంలో గుంతలు పూడ్చివేత, రహదారి లైటింగ్, సూచిక బోర్డులు, జీబ్రా క్రాసింగ్లు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించడం అధికారుల బాధ్యత అని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read also : ఫిబ్రవరి 12 తేదీన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
Read also :Bharat Taxi Launch: అందుబాటులోకి ‘భారత్ ట్యాక్సీ’ సేవలు, వీటి ప్రత్యేత ఏంటంటే?





