డప్పుచప్పుళ్ల నడుమ గద్దెకు చేరిన సమ్మక్క

అంగరంగ వైభవంగా సాగిన సమ్మక్క ప్రతిష్ఠా ఘట్టం

పెద్దపెల్లి,క్రైమ్ మిర్రర్ :- కమాన్‌పూర్ మండల కేంద్రంలోని గుండారం గుట్ట ప్రాంతం ఆదివారం భక్తి పరవశంతో మార్మోగింది. కోయ గిరిజన సంప్రదాయాల నడుమ, శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారాలకు అద్దం పడుతూ శ్రీ సమ్మక్క దేవత గద్దెకు చేరే ఘట్టం అంగరంగ వైభవంగా సాగింది. గుండారం గుట్ట ప్రాంతంలో కోయ పూజారులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం, డప్పుచప్పుళ్లతో, ఆటపాటలతో, ఉత్సాహభరిత నృత్యాలతో సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు.డప్పుల మోతలతో అడవులు మార్మోగగా, కోయ యువకులు–యువత సంప్రదాయ వేషధారణలో నృత్యాలు చేస్తూ అమ్మవారి శోభాయాత్రలో పాల్గొన్నారు. అడుగడుగునా భక్తుల జయజయధ్వానాలు, “సమ్మక్క తల్లీ” అంటూ మార్మోగిన నినాదాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉద్ధీపింపజేశాయి.

ఆత్మకూరులో ఐఓసిఎల్ వారి సేఫ్టీ క్లీనిక్ నిర్వహణ

సమ్మక్క గద్దెకు చేరిన వెంటనే సమీపంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి, మొక్కులు చెల్లించుకుని అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. తమ కుటుంబాలు సుఖశాంతులతో ఉండాలని, పాడిపంటలు బాగా పండాలని, గ్రామాల్లో వర్షాలు సమృద్ధిగా కురవాలని, అనుకున్న పనులు సఫలమవాలని భక్తులు అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.ఈ ప్రతిష్ఠా కార్యక్రమంలో కోయ పూజారులు ముఖ్య పాత్ర పోషించగా, జాతర కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. గుండారం గ్రామ పాలకవర్గం, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమానికి విశేష శోభను చేకూర్చారు. సమ్మక్క–సారలమ్మ జాతర అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాకుండా, గిరిజనుల ఆత్మగౌరవానికి, వారి సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఘట్టం మరోసారి ప్రజల మనసుల్లో అమ్మవారి మీద ఉన్న అపార భక్తిని చాటిచెప్పింది.

Kolkata Fire Horror: కోల్‌కతా ఘోర అగ్నిప్రమాదం.. 21కి చేరిన మృతుల సంఖ్య.. మరో 28 మంది మిస్సింగ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button