క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడో యువకుడు. తనతో పెళ్ళికి నిరాకరించిందని ప్రియురాలిని హతమార్చాడు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపై కూడా దాడి చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన ముగ్గురిపై అదే కాలనికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో షెట్పల్లి అలేఖ్య (23) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందగా, అలేఖ్య వదిన జయా (25), కొడుకు రియన్స్(3)కు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. అలేఖ్య, జయా, రియన్స్ ఖానాపూర్ మార్కెట్ కు వచ్చి పెళ్లి సామాన్లు కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో శివాజీ నగర్ శివారులో శ్రీకాంత్ అనే యువకుడు కాపు కాసి దాడి చేశాడు. అయితే అలేఖ్యకు మరో యువకుడితో నెల క్రితం వివాహం నిచ్చయమైంది. దీనిని తట్టుకోలేక అలేఖ్యపై ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. తనను కాదని మరో వ్యక్తితో పెళ్ళికి ఒప్పుకోవడంతో గొడ్డలితో ఆమెపై దాడి చేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :
- కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ.. కాంట్రవర్సీ వద్దన్న రాజగోపాల్ రెడ్డి
- వైద్యులు లేని మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రి….
- త్వరలోనే మరో రెండు గ్యారెంటీలు అమలు.. గవర్నర్ ప్రసంగంలో తమిళిసై వెల్లడి
- హైదరాబాద్ లో ఎన్ఐఏ దాడులు.. ఆ పత్రిక ఎడిటర్ ఇంట్లో సోదాలు!!
- గృహజ్యోతి ఫ్రీ కరెంట్ అర్హుల ఎంపికపై కసరత్తు.. రేషన్ కార్డు ఉంటనే పథకం ?
One Comment