క్రైమ్ మిర్రర్, ములుగు(ప్రతినిధి) : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహాజాతర అంగరంగ వైభంగా జరుగుతోంది. మూడోరోజు జాతరలో భాగంగా అమ్మవార్లు గద్దెలపై కోలువుదీరడంతో దర్శనాలకు భక్తజనం బారులు తీరారు. ముందుగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకున్నారు. ప్రముఖులు, రాజకీయనాయకులు సైతం వనదేవతల దర్శనానికి తరలివచ్చారు. దీంతో సాధారణ దర్శనానికి రెండు నుంచి ఐదుగంటల సమయం పట్టింది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతడాలుగా మేడారానికి క్యూ కట్టారు. దీంతో ములుగు జిల్లా మేడారం సమీపంలోని ప్రాంతాలలో ట్రాఫిక్ స్తంభించింది.
Also Read : భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి.. నేడు సీఎం సుదీర్ఘ సమీక్ష
మహాజాతర చివరి అంకాని చేరుకొవడంతో భక్తులు భారీ సంఖ్యలో రానున్నట్లు చెబుతున్నారు. కాగా ఇవాళ సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు వారి వారి ఆలయాలకు తీసుకెళ్లనున్నారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమభరిణెతో పూజారులు వన ప్రవేశం చేయడంతో మహాజాతర ముగుస్తుంది. అయితే ఇప్పటి వరకు మేడారంలోని సమ్మక్క, సారలమ్మలను 1.20 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. గత నెల రోజుల నుంచి జాతర ముందు వరకు 50 లక్షల మంది, జాతర టైంలో 70 లక్షల మంది భక్తులు అమ్మలను దర్శించుకున్నారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇవాళ జాతర చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
- ఐఏఎస్ల బదిలీలు.. మంత్రి శ్రీధర్ బాబు సతీమణి మళ్లీ ట్రాన్స్ఫర్.. ఈసారి ఏ శాఖకంటే..
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో షాకింగ్ ట్విస్ట్.. నిందితురాలిగా కవిత పేరు.. అరెస్ట్కు రంగం సిద్ధం..!?
- నాగార్జునసాగర్ దగ్గర కనిపించిన అరుదైన దృశ్యం.. చూసేందుకు ఎగబడుతున్న జనం
- మేడారం మహాజాతరపై కేంద్రానికి ఎందుకింత వివక్ష.. సీఎం రేవంత్రెడ్డి
- కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు.. BRS నుంచి వచ్చిన ‘ఆ నలుగురికి’ ఫిక్స్??