
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- తెలుగుదేశం పార్టీ నేడు మహానాడు కార్యక్రమాన్ని కడపలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డపైనే చంద్రబాబు నాయుడు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఒక రికార్డు అనే చెప్పాలి. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ ఇద్దరు కూడా చాలా బాగా ఉపన్యాసం ఇచ్చారు. టిడిపి సాధించిన విజయాలను అలాగే.. అధికారంలోకి రావడానికి దారి పొడవున ఎదురైన ఇబ్బందులను.. ప్రతిపక్ష హోదాలో ఉన్న ఐదేళ్లలో పడిన కష్టాలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగించారు.
మరోవైపు మంత్రి నారా లోకేష్ మహిళల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో నారా లోకేష్ పై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. మహిళల విషయంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలను కించపరిచేలా ఎప్పుడూ కూడా మాట్లాడకూడదని ప్రసంగించారు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళా మంత్రిగా పనిచేసిన రోజా చేసిన కామెంట్స్ ను ప్రతి ఒక్కరు కూడా వినే ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి మహిళలతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. నారా లోకేష్ కు గాజులు మరియు చీర పంపిస్తానని ఈ రోజా సవాల్ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే అప్పట్లో రోజాకి స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు లోకేష్. చీర మరియు గాజులు పంపిస్తే పంపించండి అవి మా ఆడబిడ్డలకు అందించి ఆశీర్వాదం తీసుకుంటానని మహానాడు వేదికగా గుర్తు చేసుకున్నారు నారా లోకేష్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్లలో గౌరవం లేకుండా మాట్లాడొద్దని అన్నారు. దీంతో చాలామంది వైసిపి నేతలతో పాటుగా రోజా గుండెల్లో కూడా రైలు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది వైసిపి నేతలు గతంలో కొన్ని విషయాలు కారణంగా జైలు పాలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రోజా కూడా జైలు శిక్ష అనుభవిస్తుందేమో అని ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు.