క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందంటూ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారంటూ రాజ్యసభ సాక్షిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినా 10 ఏళ్లు అధికారం దక్కలేదన్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ త్వరలో కూలడం ఖాయమంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్కు అలవాటని అన్నారు. దేశంలో అతిత్వరలో కాంగ్రెస్ కనుమరుగవుతుందంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Read Also : నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానంతో కన్న కూతుర్ని హతమార్చిన తండ్రి
ఏపీలో కాంగ్రెస్ ఉనికి లేకుండా పోయిందన్నారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. 2029లో కూడా తాను ఎంపీగా ఉంటానని పేర్కొన్న విజయసాయిరెడ్డి.. 2029లో కాంగ్రెస్కు ఒక్క ఎంపీ కూడా ఉండరు.. ఇది తన ఛాలెంజ్ అంటూ పేర్కొన్నారు. కాగా.. పార్లమెంట్ లో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది.. హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వైసీపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే.. విజయసాయిరెడ్డి రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడటం చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి :
- కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం పెద్దఎత్తున పోటీ.. 17 ఎంపీ సీట్లకు 306 దరఖాస్తులు
- కాంగ్రెస్ పార్టీలో విషాదం.. పెద్దపల్లి మాజీ MLA కన్నుమూత
- బాలికల ఆత్మహత్య ఘటన కేసులో కీలక మలుపు….
- పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు అరెస్ట్..!
- రియల్ ఎస్టేట్ మోసాలపై పోలీసుల ఫోకస్.. రంగంలోకి ఈడీ, ఐటీ!!!
One Comment