
గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్లో పోస్టుమార్టం జరుగుతోంది. ఏడుగురు మంత్రులపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా ఉన్నట్టు సమాచారం. మంత్రుల వల్లే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ స్థానంలో పట్టు కోల్పోయామని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. పైగా… బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్ల తేడా కూడా పెద్దగా తేడా లేదు.. కేవలం 4శాతం ఓట్ల తేడానే ఉందని రిపోర్ట్లు చెప్తున్నాయి. దీంతో… ఓటమికి బాధ్యులెవరు..? అనేది తేలుస్తోంది కాంగ్రెస్ పార్టీ. సులువుగా గెలవాల్సిన స్థానంలో ఓడిపోవడం ఏంటి..? అనేది దానిపై పోస్టుమార్టం నిర్వహిస్తోంది పార్టీ. మరోవైపు… ఎమ్మెల్సీ ఓటమికి అభ్యర్థి నరేందర్రెడ్డే కారణమని మంత్రులు వాదిస్తున్నారు. కానీ… ఇన్చార్జ్ మంత్రులే కారణమని పార్టీ భావిస్తోంది. ఏడుగురు మంత్రులపై హైకమాండ్ సీరియస్గా ఉన్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ముఖ్యంగా… మంత్రుల పనితీరుపై ఫోకస్ పట్టింది అధిష్టానం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంత మంది మంత్రులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడ ప్రచారం చేశారు.. ? ఎంత సీరియస్గా తీసుకున్నారు అన్నదానిపై కూడా ఆరా తీస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్రెడ్డి తీరు కూడా ఓటమికి కారణమని కొందరు మంత్రులు చెప్తున్నారు. నరేందర్రెడ్డి పార్టీ నేతలు, క్యాడర్ను పట్టించుకోకుండా.. సొంత మనుషులను పక్కన పెట్టుకుని తిరిగారని ఆరోపిస్తున్నారు. అయితే… పార్టీ హైకమాండ్ మాత్రం మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Read More : త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ – కొత్త మంత్రులు వీరే
ఉమ్మడి కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానం… కాంగ్రెస్కు సిట్టింగ్ సీటు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటును సొంత చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉండాలి. కానీ… అలా జరగలేదు. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్సీ గెలుపుతో కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ బీజేపీ విమర్శలు చేస్తోంది. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని.. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని… అందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమని ప్రచారం చేస్తోంది. ఇది.. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్లో నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో… ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు… ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అసంతృప్తిగా ఉన్నారు. మంత్రుల పనితీరుపై సీరియస్గా ఉన్నారు. ఇన్ఛార్జ్ మంత్రి.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో.. సరిగా పాల్గొన్నారా లేదా..? అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది అన్న అంశంపై కూడా సీరియస్ చర్చిస్తున్నట్టు సమాచారం. సరిగా పనిచేయని మంత్రులపై వేటు వేయాలన్న ఆలోచనలో కూడా హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే… భవిష్యత్లో పార్టీకి మరింత నష్టం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి…
-
అనుమతులు లేని ప్రైవేటు ఆసుపత్రులు నడిపితే కఠిన చర్యలు తప్పవు
-
రేవంత్ మీటింగ్కు కిషన్ రెడ్జి, బండి సంజయ్!
-
తమిళనాడు గవర్నర్గా విజయసాయిరెడ్డి – ఇందంతా జగన్ స్కెచ్చేనా?
-
కిషన్రెడ్డి – బండి సంజయ్ మధ్య క్రెడిట్ వార్ – ఎమ్మెల్సీల విజయం వెనుక ఎవరి పాత్ర ఎంత?
-
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బీఆర్ఎస్ పోటీ – ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా కేసీఆర్ వ్యూహం