క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే రిజల్ట్ రిపీట్ చేయాలని అనుకుంటుంది. మెుత్తం 17 ఎంపీ సీట్లకు గాను 12 నుంచి 14 సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అందుకు తగ్గట్లుగా గెలుపు వ్యుహాలను రచిస్తోంది. సర్వేల ఆధారంగా విజయం సాధించే అభ్యర్థులకే సీట్లు కేటాయిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆ పేర్లను సెంట్రల్ కమిటీకి పంపించి అభ్యర్థులను సెలక్ట్ చేయనున్నారు. మెుత్తం 17 స్థానాల్లో సగం సీట్లకు అభ్యర్తులు ఖరారైనట్లు సమాచారం. రెండ్రోజుల క్రితం కొడంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. మహబూబ్నగర్ అభ్యర్థిగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డిని ప్రకటించారు.
Read Also : మేడారం సమక్క – సారమ్మను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి అర్జున్ ముండా
ఇక మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన నలుగురికి సీట్లు కన్ఫార్మ్ అయినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినవారిలో పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతకు అదే స్థానం కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ పట్నం సనీతా మహేందర్ రెడ్డికి చేవెళ్ల, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్కు సికింద్రాబాద్, సినీ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్లు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు జానా రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి నిజామాబాద్, సురేష్ కుమార్ షెట్కర్కు జహీరాబాద్ ఎంపీ టికెట్లు కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరి అభ్యర్థిత్వానికి పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Also Read : ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ డే… ఒకేరోజు విచారణకు కవిత, కేజ్రీవాల్
వంశీచందర్ రెడ్డికి ఇప్పటికి టికెట్ కన్ఫార్మ్ కాగా.. ఈ ఏడు సీట్లకు కూడా అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లే. ఇక మిగిలిన 9 సీట్లకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతోంది. పట్నం దంపతులకు వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో మంచి పట్టు ఉండటంతో సునీతకు చేవెళ్ల సీటు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. వెంకటేష్ నేత సిట్టింగ్ ఎంపీ కావటంతో ఆయనకే మరోసారి అవకాశం కల్పించనున్నారు. ఇక దేశంలోనే పెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి కంచర్ల బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. అల్లు అర్జున్ సినీ గ్లామర్ ఆయన గెలుపుకు పనికొస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. బొంతు రామ్మోహన్ విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి వచ్చారు. హైదరాబాద్ మేయర్ గాను పని చేశారు. ఆయన భార్య ప్రస్తుతం చర్లపల్లి కార్పొరేటర్గా ఉన్నారు. బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన బొంతు టికెట్ కేటాయిస్తే ఈజీగా గెలుస్తామని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :
- ఎమ్మెల్యేగా గెలిచాక లాస్యకు వరుసగా ప్రమాదాలు.. వెంటాడిన మృత్యువు..
- లాస్య నందిత మృతి అత్యంత విషాదకరం… సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి
- ఆదివాసీల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం.. మేడారం జాతరపై కీలక వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి
- తెలంగాణ కానిస్టేబుళ్ల శిక్షణకు 30 శాతం అభ్యర్ధులు డుమ్మా.. తలలు పట్టుకున్న పోలీస్ శాఖ!!
- తాగుడు ఎంత పని చేసింది.. గదిలో ఉండగానే ఇల్లు కూల్చివేత.. వ్యక్తి మృతి