క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి. లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. పటాన్చెరు ఓఆర్ఆర్పై రోడ్డు పక్కన రెయిలింగ్ను ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం (ఫిబ్రవరి 23) తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న పీఏ ఆకాష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఆకాష్కు తప్ప ఎవరికి తెలియదు. ఈ నేపథ్యంలో యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఏం జరిగిందో అతడు వెల్లడించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్పృహలోకి వచ్చిన ఆకాష్ నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు.
Read Also : హీటెక్కుతున్న లోక్సభ ఎన్నికల పోరు.. రాష్ట్రంలో త్రిముఖ పోటీ తప్పదా??
యాక్సిడెంట్ గురించి అతడు ఈ విధంగా వెల్లడించారు. ‘ సదాశివపేట దర్గా నుండి హైదరాబాద్ చేరుకున్నాం. లాస్య కారులో ఉన్న తన అక్క కూతుర్ని మరో కారులోకి ఎక్కించాం. లాస్య ఏదానా తిందాం అని అనటంతో హోటల్స్ వెతుక్కుంటూ వెళ్లాం. యాక్సిడెంట్ ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. ఆ టైంలో నా మైండ్ బ్లాంక్ అయ్యింది.’ అని ఆకాష్ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇక ఈ యాక్సిడెంట్లో ఆకాష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకాష్ నిర్లక్ష్యపూరితంగా కారు నడపడం వల్లే లాస్య చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఆకాష్ నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. మేజిస్ట్రేట్ సమక్షంలో స్పృహలో ఉన్న ఆకాష్ వాంగ్మూలం ఇచ్చాడు. ఇక ప్రమాదం జరిగిన తీరును స్థానిక డీఎస్పీ మీడియాకు వెల్లడించారు.
Also Read : వృద్ధాప్యంలో తల్లిన పట్టించుకోని కొడుకు.. కుమారుడు, కోడలికి జైలు శిక్ష!!!
ముందు వెళ్తున్న వాహనం ఢీకొట్టిన తర్వాత ఎమ్మెల్యే కారు కంట్రోల్ కాక ఓఆర్ఆర్పై లెఫ్ట్ సైడ్ రెయిలింగ్కు ఢీ కొట్టిందని చెప్పారు. ప్రమాదం కంటే ముందే కారు ముందు భాగం పగిలి కింద పడిపోయి ఉన్నాయన్నారు. నిర్లక్షంగా అతివేగంగా నడపడం వల్లే కారు ప్రమాదం జరిగిందని డీఎస్పీ చెప్పారు. లాస్య సోదరి నివేదిత ఫిర్యాదుతో ఆకాష్ మీద ఐపీసీ సెక్షన్ 304 ఏ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సదాశివపేటలోని ఓ దర్గాలో మొక్కులు చెల్లించడానికి ఎమ్మెల్యే లాస్య నందిత తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొచ్చి.. కుటుంబ సభ్యులను ఇంటి దగ్గర దింపిన తర్వాతే టిఫిన్ కోసం సంగారెడ్డి వైపు వెళ్లారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. షామీర్ పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి లాస్య కారు ఎంట్రీ అయినట్టు పోలీసులు గుర్తించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక శుక్రవారమే ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు పూర్తైన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
- సీఎం హెచ్చరించినా వినిపించుకోలేదు.. ముగ్గురు విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్
- భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి.. నేడు సీఎం సుదీర్ఘ సమీక్ష
- నేడు జనం నుంచి వనంలోకి వనదేవతలు.. మూడోరోజు బారులు తీరిన భక్తజనం
- ఐఏఎస్ల బదిలీలు.. మంత్రి శ్రీధర్ బాబు సతీమణి మళ్లీ ట్రాన్స్ఫర్.. ఈసారి ఏ శాఖకంటే..?
- ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ డే… ఒకేరోజు విచారణకు కవిత, కేజ్రీవాల్