క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గులాబీ బాస్ కేసీఆర్ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి ఎన్నికలకు వెళ్ళిన కేసీఆర్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలను కాపాడుకోవటం కేసీఆర్ కు పెద్ద కష్టమై పోయింది. ఇది అర్ధం చేసుకున్న కేసీఆర్ ఈ క్రమంలోనే రానున్న లోక్సభ ఎన్నికలలో కేవలం తెలంగాణా నుండి మాత్రమే పోటీ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.
Read Also : అసెంబ్లీ సమావేశాలపై బీఏసీలో కీలక నిర్ణయాలు..!!
ఇంట గెలిచి రచ్చ గెలవాలని కేసీఆర్ శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ అవకాశవాద రాజకీయాలలో నీవు నేర్పిన బాటే నీరజాక్ష అన్నట్టు గులాబీ పార్టీ నేతలు రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ వైపు, కాంగ్రెస్ కాదంటే, దేశంలోని అధికార బీజేపీ వైపు చూస్తున్నారు. చేరికలకు రెడీ అవుతున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు గంప గుత్తగా ఇతర పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యేలను, ముఖ్య నాయకులను కేసీఆర్ ఏ విధంగా అయితే కారు ఎక్కించారో అదే విధంగా తాజాగా చాలా మంది కాంగ్రెస్ బాట పట్టటం కోసం సిద్ధంగా ఉన్నారు.
Also Read : నిర్మల్ జిల్లాలో దారుణం..ప్రియురాలిని హత్య చేసిన యువకుడు
రాష్ట్రంలో గత పాలన సమయంలో అక్రమాలపై రేవంత్ ఫోకస్ చేస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ నేతలు సేఫ్ గా ఉండాలని, కాస్త చేయి అందిస్తే జంప్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ కోసం పని చేస్తామని వచ్చిన నాయకులు కూడా కేసీఆర్ తాజా పరిస్థితి నేపధ్యంలో దుకాణం సర్దేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణా తర్వాత కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. కానీ మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పోటీలో ఉండే పరిస్థితి లేదని తేలటంతో మహా బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు షాకిచ్చే పనిలో ఉన్నారు. మొత్తంగా అన్ని వైపుల నుండి ప్రస్తుతం కేసీఆర్ సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ.. కాంట్రవర్సీ వద్దన్న రాజగోపాల్ రెడ్డి
- వైద్యులు లేని మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రి….
- త్వరలోనే మరో రెండు గ్యారెంటీలు అమలు.. గవర్నర్ ప్రసంగంలో తమిళిసై వెల్లడి
- హైదరాబాద్ లో ఎన్ఐఏ దాడులు.. ఆ పత్రిక ఎడిటర్ ఇంట్లో సోదాలు!!
- గృహజ్యోతి ఫ్రీ కరెంట్ అర్హుల ఎంపికపై కసరత్తు.. రేషన్ కార్డు ఉంటనే పథకం ?
One Comment