క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆ ఊరికి దెయ్యం పట్టిందా? వరుస మరణాలకు కారణం అ సైతానేనా..? చచ్చిన తర్వాత కూడా పీక్కుతింటోందా? ఇలా భయంభయంగా బతికేస్తోంది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రజానీకం. ఊరు ఖాళీ అయ్యేదాకా వదిలేది లేదంటూ ముగ్గురు గుర్తు తెలియని మహిళలు అక్కడే మకాం పెట్టేశారు. ఎవరు వాళ్లు.. వాళ్లకేం కావాలి.. వాళ్ల వికృత చేష్టల వెనుక అసలు విషయమేంటి..? ఎవరు తేల్చాలి ఈ మిస్టరీని? అన్నది పెద్ద క్వచ్చన్ మార్క్…అసలే వరుస మరణాలతో భయంభయం. నెల రోజుల్లో పదిమంది మృత్యువాత. వైద్యులు తేల్చిన కారణం గుండెపోటు. కానీ.. మరేదో మర్మం ఉందని స్థానికుల సందేహం. దానికితోడు స్మశానంలో దొంగలు పడ్డారు! మరుభూమిలో సంచరిస్తూ ఎముకలు కూడా మాయం చేస్తున్నారు మాయదారి మహిళలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఇదొక భయానక పరిస్థితి.
Read Also : మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం.. కాంగ్రెస్కు రెండు, బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం
దహన సంస్కారం ముగించి అస్థికల్ని గంగలో కలిపేందుకు 11 రోజుల వరకు ఆగాలి. కానీ.. ఆలోగానే అస్థికలు మాయమైపోతున్నాయి. ఇదెక్కడి చోద్యం.. అసలిదెలా సాధ్యం.. ? అన్నదే ఇప్పుడు మిస్టరీ. సరిగ్గా ఇదే సమయంలో… స్మశాన వాటికలో కాలుతున్న కాష్టాన్ని నీళ్లతో ఆర్పి, ఎముకల్ని, బూడిదను కుప్ప చేస్తున్న మహిళల్ని చూసి స్థానికులు అవాక్కయ్యారు. పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అంతిమ సంస్కారంలో భాగంగా మృతదేహం నోట్లో బంగారం పెడతారు. ఆ బంగారాన్ని చోరీ చేయడం కోసం వచ్చిన దొంగలా.. లేక.. ఇక్కడి ఎముకల్ని తీసుకెళ్లి క్షుద్ర పూజలో వాడుకుంటున్నారా.. ఇలా అంతుబట్టని ప్రశ్నలతో కొట్టుమిట్టాడుతోంది సుల్తానాబాద్ జనం. మంచిర్యాల నుంచి ఆటోలో వచ్చిన ఈ మహిళల అసలు ఉద్దేశమేంటి.. ఈ ఊరి మీదే వాళ్లెందుకు దృష్టి పెట్టారు.. వరుస మరణాలకు- వీళ్లకు సంబంధం ఏమైనా ఉందా.. విచారించి, చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు స్థానికులు.
ఇవి కూడా చదవండి :
- బీఆర్ఎస్ తో పొత్తు అంటే చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- ఢిల్లీకి గులాబీ బాస్ కేసీఆర్.. సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నా కేసీఆర్ టూర్!!
- టీ కాంగ్రెస్లో కారు చిచ్చు.. మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు!!!
- మేడారం జాతర ఎఫెక్ట్… సాధారణ ప్రయాణికులకు అసౌకర్యం
- ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ బిడ్డలకు అన్యాయం.. సోనియా, ఖర్గేలకు కవిత లేఖ..
One Comment