క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ కొండగల్ నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సీఎం శంఖుస్థాపన చేయనున్నారు. కొడంగల్లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గంలో మొత్తం రూ.4369.143 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేస్తారు. ఇవాళ సాయంత్రం హెలికాఫ్టర్లో కోస్గి చేరుకోనున్న సీఎం రేవంత్.. కోస్గి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మైదానంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించనున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి అనంతరం వారికి బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి :
- మహాజాతరకు నేడే అంకురార్పణ.. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
- ఆ ఊరికి దెయ్యం పట్టిందా?.. చచ్చిన తర్వాత కూడా పీక్కుతింటోందా?
- మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం.. కాంగ్రెస్కు రెండు, బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం
- ఢిల్లీకి గులాబీ బాస్ కేసీఆర్.. సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నా కేసీఆర్ టూర్!!
- టీ కాంగ్రెస్లో కారు చిచ్చు.. మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు!!!
One Comment