క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా సొంతిళ్లు లేని పేదలకు ఇందరిమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు నిర్మాస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖాళీ జాగా ఉంటే ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, స్థలం లేని వారికి స్థలం ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా సొంతిళ్లు లేని పేదలకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం అందించడానికి అవసరమైన కార్యాచరణ మొదలు పెడుతున్నట్లు ప్రకటించింది.
Read Also : తెలంగాణ అసెంబ్లీలో ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క..
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద పొందగలిగే నిధులను గత ప్రభుత్వం వినియోగించుకోలేకపోయిందని.. కేంద్రం నుంచి అధిక మొత్తంలో నిధులు రాబట్టి వాటిని తెలంగాణ ప్రజలకు మరింత ఎక్కవ లబ్ధి చేకూర్చేలా వినియోగిస్తామని ఆర్థిక శాఖ మంత్రి భట్టి తెలిపారు. ఇండ్ల పథకం కింద ప్రతీ నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తామని అన్నారు. ఈ పథకానికి ప్రస్తుత బడ్జెట్లో 7,740 కోట్ల కేటాయింపులు చేసినట్లు చెప్పారు.
Also Read : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. మేడిగడ్డ పర్యటనకు సిద్దమౌతున్న రాష్ట్ర ప్రభుత్వం
కాగా, గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు గృహజ్యోతి పథకం కింద ఇంటి నిర్మాణానికి 3 లక్షలు ఇస్తామని ప్రకటించారు. అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి.. కొందరికి పత్రాలు కూడా అందించారు. అయితే ప్రభుత్వం మారటంతో ఆ పథకాన్ని రద్దు చేశారు. అప్పటి ఎంపికలో బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇండ్లు మంజూరు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిజమైన అర్హులను ఎంపిక చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
- చౌటుప్పల్లో కిడ్నాప్ ముఠా కలకలం.. కారులో వచ్చి పిల్లల్ని అపహరించేందుకు యత్నం
- అడిగిన చోట బస్సు ఆపలేదని రెచ్చిపోయిన మహిళ.. కండక్టర్ పై చెప్పుతో దాడి
- బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
- తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు.. జాబితా విడుదల అప్పుడే!!
- మల్కాజ్గిరి ఎంపీ టికెట్ రేసులో హేమాహేమీలు.. అధిష్ఠానం చూపు అతనివైపేనా..?
One Comment