
హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ లో విషాదం జరిగింది. అత్తగారి ఇంటికి వెళ్తూ.. ట్రైన్ కిందపడి మహిళ మృతి చెందింది. కళ్ళెదుటే తల్లి ట్రైన్ కిందపడి చనిపోవడంతో తల్లడిల్లిపోయారు ఇద్దరు పిల్లలు.ట్రైన్ బోగీ మారేందుకు ప్రయత్నిస్తూ.. ట్రైన్ ప్లాట్ఫామ్ మధ్య పడిపోయి ముక్కలైంది శ్వేత.
సెలవుల్లో అనకాపల్లి జిల్లా దొండపూడి లోని అత్తారింటికి వెళ్లేందుకు సిద్ధమైంది శ్వేత. భార్య, ఇద్దరు పిల్లలను లింగంపల్లి లో జన్మభూమి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కించాడు భర్త వెంకటేష్. అయితే D-8 లో ఎక్కాల్సిందిపోయి.. పొరపాటున D-3లో ఎక్కారు శ్వేత, పిల్లలు.. D-3లోని ప్రయాణికులు అవి తమ సీట్లు అని చెప్పడంతో బోగీ మారేందుకు ప్రయత్నించారు.
బోగీలో రద్దీగా ఉండటంతో.. చర్లపల్లి రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఆగిన తర్వాత.. D-8 లోకి మారేందుకు వెళ్లారు. ఇద్దరు పిల్లలు, లగేజ్ ను బోగీలోకి ఎక్కించింది శ్వేత. అప్పటికే ట్రైన్ కదులుతుండటంతో.. ట్రైన్ ఎక్కే సమయంలో ట్రైన్, ప్లాట్ఫామ్ మధ్య పడిపోయింది శ్వేత. గమనించిన ప్రయాణికులు.. ట్రైన్ చైన్ లాగి శ్వేత ను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే శ్వేత మృతి చనిపోయింది. తమ కళ్ల ముందే తల్లి చనిపోవడంతో ఇద్దరు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు.