క్రైమ్ మిర్రర్, చింతపల్లి : కుటుంబంలో పెద్ద దిక్కుకు కష్టం వస్తే, ఆ కుటుంబమే చిన్నాభిన్నం అవుతుంది. ఎటూ తోచని అలాంటి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్. మాడ్గుల మండలం, కొలుకులపల్లి గ్రామానికి చెందిన చొల్లేటి బ్రహ్మచారి గత కొంతకాలంగా డయాలసిస్ తో ఇబ్బంది పడుతున్నారు. ఇంటి పెద్దకే ఆపద రావటంతో, భార్య స్వప్నకు ఎటూ తోచని పరిస్థితి ఏర్పడింది. బాధితుడికి ఇద్దరు చిన్న వయసు గల ఆడపిల్లలు ఉన్నారు. డయాలసిస్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న తన భర్తను చూసుకుంటూ, ఒంటి చేతితో కుటుంబాన్ని నెట్టుకొస్తుంది భార్య స్వప్న. వారి కుటుంబానికి ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు అండగా నిలిచారు.
Read Also : గైడ్గా ‘మై మేడారం యాప్’… యాప్ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క, కలెక్టర్
స్వప్న మాల్ నందు గల ఫౌండేషన్ ని సంప్రదించి సహాయం కోరడంతో, విషయం తెలుసుకున్న పగడాల ముత్తు, వారి కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం 10 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు. భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా ఫౌండేషన్ ని సంప్రదించాలని వారికి తెలిపారు. అభాగ్యులకు బాసటగా నిలుస్తున్న చైర్మన్ ముత్తుకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సహాయం చేస్తున్న కనకయ్య ఫౌండేషన్ వర్ధిల్లాలని దీవిస్తున్నారు. ఈ సందర్బంగా పగడాల ముత్తు మాట్లాడుతూ, తన తండ్రి కనకయ్య జ్ఞాపకార్థం ఈ ఫౌండేషన్ ని ఏర్పాటు చేసామని, పేద ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూనే ఉంటామని, తన తండ్రి ఋణం తిర్చుకోవడానికి ఈ ఫౌండేషన్ ని స్థాపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ మాడ్గుల శిరీష, కార్యదర్శి పగడాల కళ్యాణ్, మొగిలి కిషన్, మెంబర్ నాంపల్లి పరమేష్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
- చావు అంచుకు వెళ్లిన వ్యక్తికి ప్రాణం పోసిన పోలీస్.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్సై
- బీఆర్ఎస్లో మరో వికెట్ డౌన్.. ఈసారి ఎమ్మెల్యే.. ఎలక్షన్ రిజల్ట్ రోజు నుంచే లీకులు..!!!
- ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. రంగంలోకి తెలంగాణ సీఎం???
- పార్లమెంట్ ఎన్నికల సమర శంఖం పూరించనున్న తెలంగాణ బీజేపీ.. నేటి నుండి విజయ సంకల్ప యాత్రలు
One Comment