క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రాయగిరి చెందిన ముస్లిం దంపతులు యాకూబీ, చోటులకు మొదటి నుంచి సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉండేది. దీంతో రాయగిరిలో సహృదయ అనాథ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటుచేసి 15 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. అనాథ వృద్ధాశ్రమానికి వచ్చే వారి పట్ల ప్రేమ ఆప్యాయతలు కనబరుస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల గ్రామానికి చెందిన చంద్రకళ(72) భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఈమెకు పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా ఉంటుంది. వృద్ధాప్యంలో చంద్రకళ అలనా పాలన చూసేవారు లేకపోవడంతో ఆమె సోదరుడు గంగ ప్రసాద్ ఈ ఏడాది జనవరి 19న రాయగిరి లోని సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో చేర్పించాడు. అనారోగ్యంతో ఉన్న చంద్రకళ బాగోగులను ఆశ్రమ నిర్వాహకులు యాకూబీ, చోటు చూస్తున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన చంద్రకళ మార్చి 23వ తేదీన మృతి చెందింది.
Read Also : బిగ్ డే.. ముగియనున్న కవిత కస్టడి.. బెయిల్ రాకపోతే నెక్స్ట్ ఏంటి..?
ఈ విషయాన్ని చంద్రకళ సోదరుడు గంగాప్రసాద్కు ఆశ్రమ నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. అయితే చంద్రకళ మృతదేహం కోసం సోదరుడు గంగా ప్రసాద్ రాక కోసం ముస్లిం దంపతులు రెండు రోజులపాటు వేచి చూశారు. చంద్రకళ మృతదేహాన్ని తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు సోదరుడు గంగా ప్రసాద్ నిరాకరించాడు. దీంతో ఆశ్రమ నిర్వాహకులు యాకూబీ, చోటు రాయిగిరి శ్మశాన వాటికలో చంద్రకళ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. హైందవ సంప్రదాయం ప్రకారం.. చితి చుట్టూ కుండతో తిరిగి.. యాకూబీనే తన చేతితో చితికి నిప్పంటించి దహన సంస్కారాలు చేశారు. మృతి చెందిన వృద్ధురాలికి హిందూ సంప్రదాయం మేరకు అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం మహిళ యాకుబీ మానవత్వాన్ని పరిమళింపజేసింది. అయితే ముస్లిం మహిళ అయినప్పటికీ హిందూ సంప్రదాయం ప్రకారం దహనసంస్కారాలు చేయడంపై పలువురు ఆమెను అభినందించారు. ఇప్పటివరకు యాకూబీ, చోటు దంపతులు యాదాద్రి, వరంగల్ జిల్లాల్లో 200మంది అనాథలకు దహనసంస్కారాలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి :
- కోమటిరెడ్డి బ్రదర్స్ కూల్ కాలేదా.. అద్దంకి పదవి రానట్టేనా?
- వడ్డీ చెల్లించలేదని..నడ్డి విరిచాడు…చంపేస్తానంటూ తన స్టైల్ లో వార్నింగ్..?
- అన్ని పార్టీలకు కాళేశ్వరం అవినీతి డబ్బులు!
- మాముళ్ల కోసం లారీ డ్రైవర్ బట్టలు విప్పి కొట్టిన కానిస్టేబుల్స్
- ఇల్లాలి ముఖంలో సంతోషం చూసేందుకే ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’…సీఎం రేవంత్ రెడ్డి