
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా సరే ఎలక్షన్ల సమయంలో మాత్రమే సర్వేలు జరిపి ఏ పార్టీ అత్యధిక మెజార్టీ సీట్లు దక్కించుకోబోతుందో ఒక అంచనా వేస్తారు. కాబట్టి ఎక్కువగా సర్వేలు ఎలక్షన్ల టైం లోనే హల్చల్ చేస్తూ ఉంటాయి. కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం పూర్తి భిన్నంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. అయితే అంతలోనే ఆయ పార్టీ, తమ నాయకుల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని చాలామంది సర్వేలు ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా అధికారం చేపట్టి ఏడాది పూర్తి కాలేదు కానీ వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వేల మాట ఎక్కువగా వినిపిస్తుంది. నిజం చెప్పాలంటే సర్వేలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రజల మూడ్ ఎలా ఉందనేది సర్వేల ద్వారా తెలుసుకుంటారు. మొన్న జరిగిన ఎలక్షన్లలో కూడా చాలా సర్వేలు ఆయా పార్టీలు కచ్చితంగా గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశాయి. కానీ చివరి నిమిషంలో అవి తార్మారు అయిపోయాయి. మొన్న జరిగిన ఎలక్షన్లలో వైఎస్ఆర్సిపి పార్టీ ఈ సర్వేల వల్ల నిండా మునిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ సర్వే కు మాత్రం ఇప్పటికీ కూడా మంచి గిరాకే ఉంది.
ప్రస్తుతం ప్రతి ఒక్క నాయకుడు అలాగే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ముఖ్యంగా ప్రైవేట్ సర్వే సంస్థలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటాయి. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఎంత ఖర్చైనా కూడా భరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో తమ గ్రాఫ్ ఎంత ఉందనేది ప్రజల నుంచి తెలుసుకోవాలని చాలా ఆశగా చూస్తూ ఉంటారు. అయితే ప్రజలు మాత్రం ఇక్కడ ఊహించని ట్విస్టులు ఇస్తున్నారు. ఎన్ని సర్వేలు వచ్చినా… ఎంతమంది వచ్చినా కూడా ప్రజల మాట ఒకే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యేలలో మార్పు రానంతవరకు… ఎన్ని సర్వేలు వచ్చి సర్వే చేయించుకున్న ప్రయోజనం ఉండదని ప్రజలు ఊహించని ట్విస్టులు ఇస్తున్నారు. కేవలం ప్రజలకు దగ్గరగా ఉండి వారి కష్టాలను తెలుసుకునే అవి తీర్చే నాయకులకి ఓట్లు పడతాయని ప్రజలు కరాకండిగా తెలియజేస్తున్నారు. అయినా కూడా కొన్ని సర్వేలు సోషల్ మీడియాలో మా సర్వే సంస్థలే ఖచ్చితమైన ప్రజల అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నామని ఈ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నారు.