తెలంగాణ

జగిత్యాల జిల్లాలో విచిత్రం!.. భార్య పిల్లల్ని వదిలేసి ట్రాన్స్ జెండర్‌తో సహజీవనం చేస్తున్న భర్త

జగిత్యాల జిల్లా బ్యూరో,క్రైమ్ మిర్రర్:-
ఇద్దరు పిల్లల తండ్రి తన భార్యను వదిలేసి ట్రాన్స్ జెండర్‌తో సహజీవనం చేస్తున్నాడు. జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్‌కు పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో 2014లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజశేఖర్, హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్ జెండర్‌ దీపుతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు. భార్య లాస్యను వదిలి, దీపుతో సహజీవనం ప్రారంభించాడు.విషయం తెలిసిన భార్య లాస్య మానసికంగా పుంగిపోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. లాస్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ రాజశేఖర్ హాస్పిటల్‌కు రాకపోవడంతో ఆందోళనకు గురైన అత్త,మామలు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో తన ఇంట్లోనే ట్రాన్స్ జెండర్ దీపుతో కలిసి ఉన్న రాజశేఖర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూమ్ కు తాళం వేసి.పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రాజశేఖర్, దీపులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

గంటల్లో ‘బస్టాండ్ బాలుడి’ కథ సుఖాంతం.. నల్లగొండ టూ టౌన్ సిబ్బందిపై ఎస్పీ పవార్ ప్రశంసలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button