
-
పోలీసులపై తిరగబడ్డ కేశవపట్నం గ్రామస్థులు
-
పోడు భూముల్లో మొక్కలు నాటుతున్న పోలీసులు
-
పోడు భూముల జోలికి రావొద్దని స్థానికుల హెచ్చరిక
-
పోలీసులు నాటిన మొక్కల తొలగింపు
-
భూముల స్వాధీనానికి వచ్చిన పోలీసులపై రాళ్లదాడి
క్రైమ్మిర్రర్, నిఘా: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అటవీ అధికారులు, పోలీసులపై స్థానికులు రాళ్లదాడి చేశారు. ఈ రాళ్లదాడిలో పలువురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఇచ్చోడ మండలం కేశవపట్నంలో స్థానికులు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అటవీశాఖ భూముల్లో కార్యకలాపాలు చేయొద్దంటూ కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో పోడు వ్యవసాయ పొలాల్లో కొంతకాలంగా పోలీసులు చెట్లను నాటుతున్నారు. ఆ భూమిని ఖాళీ చేయాలని స్థానికులు ఆదేశాలిచ్చారు. ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామని, ఆ భూములు లాక్కోవాలని చూస్తే సహించేది లేదని స్థానికులు హెచ్చరించారు. పోలీసులు నాటిన మొక్కలను తొలగించారు. భూముల్లో అడుగుపెడితే ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరించారు. ఈ క్రమంలో పోలీసులతో కలిసి అటవీశాఖ అధికారులు భూముల స్వాధీనానికి వచ్చారు. ఆగ్రహానికి గురైన స్థానికులు వారిపై రాళ్లతో దాడి చేశారు. ఒక్కసారిగా దాడి చేయడంతో పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Read Also: